9, జనవరి 2010, శనివారం

జనం ఎప్పుడు ఇంతే

జనం ఎప్పుడు ఇంతే
మరువకండి మన లక్ష్యం .

జనం ఎప్పుడు ఇంతే చచ్చినాక మరచి పోవడానికి జన నాయకుడిలా ప్రచారం చేయబడ్డ జన నాయకుడి చావు ల కారాదు మన ఉద్యమం. మనకు ద్రోహం చేసారని మనకు ద్రోహి గా తెలిసినా విధ్వంసం సృష్టించిన పిచ్చి జనాలు.ఉద్యమం ఉవ్వెత్తుగా ఎగసినా ,ఉసురుమనిపించిన రాజకీయ చతురత ఉన్న రాజకీయ నాయకుల నమ్ముకున్నం.మన బాగు కోసమే అని ఆందోళనలు ఆవిరి చేసినా నిరసనలు నీరసించి పోరాదు.సమైఖ్య అన్న పదానికి అర్థం తెలియక చేసే ఉద్యమాలలో ,తెలంగాణాకి సంప్రదింపుల పేరుతో సమాధి కట్టే యత్నం చేస్తున్నారు .ఎన్ని సార్లు ఈ కమిటీలు ,సంప్రదింపులు జరిపినా తెలంగాణాకి మళ్లీ మళ్లీ జరిగే మోసం పెరుగుతుందే కాని తరగదు.ఆంధ్రులు మాత్రమె ఆరంభ శూరులు అది గుర్తుంచుకోవాలి .ఇన్నాళ్ళు అన్యాయం చేస్తుంటే మీ పాలకులు ఏమి చేస్తున్నారనే ప్రశ్న మనకు ప్రతి సారి ఎదురయ్యింది .నమ్మకంగా రాజకీయాన్ని నమ్మితే మళ్లీ ఎ రాజకీయం చేస్తారో? రాజకీయాలను జనం నడుపుతున్నారా? జనాన్ని రాజకీయం నడుపుతుందా?జనం నాకు ఎందుకు లే అనుకున్న ప్రతి సారి రాజకీయ నాయకులే జనాలను నడిపినారు .ఈ సారి జనం రాజకీయ నాయకుల నడుపుతారు అనుకున్నారు జనం. జనం ఇంకా ఇలా నే జోగుతుంటే మళ్లీ జనాన్ని రాజకీయన నాయకులే నడుపుతారు .ఎవరు మాట్లదోద్దన్నారని ఎవరూ మాట్లాడటం లేదు? ఉద్యమానికి ఉపిరి వదిలిన వారికి సంతాపం కోసం మౌనంగా ఉండాల్సిన సమయం ఇది కాదు మన మాటల్లో విధ్వంసం ఉంటె వాళ్ళ చేతల్లో వినాశనం ఉంది.జయ జయ హే తెలంగాణా జననీ జయ కేతనం అని పాడుకుంది మున్నాళ్ళ ముచ్చట కోసం కాదు.ముదిమి నవ్వులు చిందే బంగారు భవిత కోసం.

ఎవరిని నమ్మి ఆపినాము ఉద్యమాన్ని ?ఎవరికోసం నడిపినాము ఈ పోరాటం? నాయకుడు దొరక ఆపినామా?
నాయకుడు అలిసినాడని ఆగిందా ఉద్యమం? ఒకరి వాళ్ళ ఒకరి కోసమే సాగిందా ఇదంతా? తప్పు మీది ,మీ పాలకులది అని వేలెత్తి చూపిస్తుంటే ఇంకా మనం ఇల్లాగే ప్రవర్తిద్దమా? చిత్త శుద్ధి గురించి పాలకులను ప్రశ్నించే మనం మన చిత్త శుద్ధి ని ప్రశ్నించుకుందాం. ఇప్పుడు రాక పోతే ఇంకెప్పుడు రాదనీ తెలిసి ఇప్పుడు లేక పోతే ఇంకెప్పుడు లేదని తెలిసి ఇంకా ఎందుకీ అలసత్వం ?ఇంకా పోరాడుతూనే ఉందామా? మన తాతల పౌరసత్వాన్ని ,మన మనుమలకు అందిద్దమ?ఎన్నికలప్పుడు మాకు ఇది అడ్డం ,అది అడ్డం అని అంటారు .ఎన్నికలయ్యాక ఏకాభిప్రాయ సాధన అంటారు .కలిసి ఉంటె కలదు సుఖం అనే జన్నల్లో ఎంత మంది తమ సొంత అన్నదమ్ములతో ,వారి తల్లి తండ్రులతో కలిసి ఉన్నారో ,కలిసి ఉండి ఎంత మంది సుఖంగా ఉన్నారో తెలియదు.ఇన్నాళ్ళు కలిసి ఉన్నా ఎవరూ శుకంగా లేరనే అందరు అంటున్నారు అయినా ఇంకా కలిసే ఉందాం అంటున్నారు.
మనం మన కోసం పోరాడుతున్నమ?మన రాజకీయ నాయకుల కోసం పోరాడుతున్నమ?నడకలో కాలి కి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీయాలి కాని కాలిని కాదు .అలా గే ఏవో అడ్డంకులు చూపిస్తున్న వారిని అడ్డం తొలగించుకోవాలి కాని ఉద్యమాన్ని ఆపుకోరాడు .అభివృద్ధి కుంటు పడుతుందని ఉద్యమం ఆపమన్నా ప్రభుత్వం ఇన్నాళ్ళు మన జీవితాలు కుంటు పడుతుంటే ఏమి చేసారో? జీతాలివ్వడానికే డబ్బులు చాలవన్నవి మాటలైతే స్విస్ బ్యాంక్ మూలుగుతున్న డబ్బు ఎవరి జీవితాలను బలియిచ్చి సంపదిన్చినారో ?విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దనే పాలకులు ,ఆ భవిత కోసం అసలు పునాదులే సరిగా నిర్మించలేదు .కడుపు మాది నోడి కేక "అమ్మా ఆకలి" కడుపు నిండి నోడి కేక "గురక" ఆకలి కేక ఎంతకైనా తెగించేలా చస్తుంది .ఆకలి కేక లోని దీనత్వం ఆకలి తీరినోడికి అర్థం కాదు .ఆకలి తీర్చ చేతాకాదు.పాలకుల నిల దీసి పని చేయించుకోవాలి కాని పాలకుడు లా మనం ప్రవర్తించ రాదు.తెలంగాణా వీరుడా జర భద్రం.