14, ఫిబ్రవరి 2017, మంగళవారం

రాజులు  మారిన రాజ్యాలు మారిన
ప్రేమ మారదు ప్రేమించే వారు మారరు
ఒక రోజుతో ప్రేమను తెలిపి మరు రోజుతో మరచిపోతే
మనసెందుకు మనిషి ఎందుకు
ఈ రోజు ప్రేమికుల రోజైనా ప్రేమను ఒక రోజుతో ముగించకు
జతకట్టిన తోడు ను జన్మాంతం ప్రేమించు 

30, జూన్ 2014, సోమవారం

నేను నమ్ముకున్న వారు

నేను  నమ్ముకున్న వారు
నన్ను నమ్మనపుడు
న శ్రమను గుర్తించక
న పైన నిందలు మోపినపుడు
నేను పంచిన సంతోషానికి నవ్వు కున్నవారు
నన్ను ఒంటరి చేసిన నాడు
నేను  చిందించిన చెమటతో నా కన్న ఎత్తుకు ఎదిగి
నీవెవరో నీ అవసరం ఎంతో నాకు అనవసరం అంటుంటే
నేను చూపిన వినయ విధేయత
నా  విధేయులకు భారం అయినపుడు
నేను  అందరు నా కోసం అనుకున్న అనాధ అయ్యాను  

నువ్వు నమ్ముకున్న వారు

నువ్వు నమ్ముకున్న వారు
నిన్ను నమ్మనపుడు
నీ శ్రమను గుర్తించక
నీ పైన నిందలు మోపినపుడు
నీవు పంచిన సంతోషానికి నవ్వు కున్నవారు
నిన్ను ఒంటరి చేసిన నాడు
నీవు చిందించిన చెమటతో నీకన్న ఎత్తుకు ఎదిగి
నీవెవరో నీ అవసరం ఎంతో నాకు అనవసరం అంటుంటే
నీవు చూపిన వినయ విధేయత
నీ విధేయులకు భారం అయినపుడు
నీవు అందరు నీకోసం అనుకున్న అనాధ అవుతావు 

అధికారం అంటే

అధికారం అంటే అజమాయిషీ కాదు
అధికారం అంటే శివలెత్త డం కాదు 
అధికారం అంటే అణగదొక్కడం కాదు
అధికారం అంటే  కున్చినుకు పోయే ఆలోచన కాదు 
అధికారం అంటే విచక్షణ కోల్పోవడం కాదు 
అధికారం అంటే విశ్రాంతి తీసుకునే పర్ణశాల కాదు 
అధికారం అంటే చెప్పుడు మాటలు వినే చేతగాని తనం కాదు 
అధికారం అంటే ఆలోచనలు అణగదొక్కడం కాదు 
అధికారం అంటే అహం కార ప్రదర్శన కాదు 
అధికారం అంటే వడ్డించిన విస్తరి కాదు 
అధికారం అంటే విస్తరి తీసేవారిని కూడా ప్రేమించడం 
అధికారం అంటే అందరిని కలుపుకు పోవడం 
అధికారం అంటే అందరికి సమ న్యాయం జరిగేల చూడడం 
అధికారం అంటే అందరి ఆలోచనలకు విలువ ఇవ్వడం 
అధికారం అంటే అహర్నిశం శ్రమించడం 
అధికారం అంటే ఆత్మీయతను పంచడం 
అధికారం అంటే నేనున్నాను అనే ధైర్యం కలిగించడం 
అధికారం అంటే అడగకుండానే ఆశీర్వదించే సంస్కారం 

25, జూన్ 2014, బుధవారం

తరాలు మారిన యుగాలు మారిన

తరాలు మారిన యుగాలు మారిన 
విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా 
ఉపగ్రహాలు ఎన్ని పంపినా 
మానవ మేధస్సు విదేశాలకు తరలినా 
మనిషి తినేది అన్నమే
కంటి నిండా నిద్ర పోయే తీరిక కోసమే 
వ్యవసాయం చేసే రైతే పంట పండించక పోతే 
బంగారం ధర తగ్గినా , ఇంధన ధర తగ్గినా , షేర్ మార్కెట్ పరుగులు తీసిన వృధా
రైతు వృద్ది చెందనంత వరకు 
రాజ్యన్నేలే రాజు పని కి రాని వాడే

23, మార్చి 2011, బుధవారం

విగ్రహాల విలువ..

విగ్రహాల విలువ..

ట్యాంక్ బండ్ మీద మేధావుల ధర్మాగ్రహం ,శాంతి యాత్ర ,శాసన సభలో ఖండన,అన్నిటికి ఒకటే కారణం విగ్రహాలను కుల్చేసారు..మామూలు విగ్రహాలా అవి న్.టి.ర్ పెట్టిన "తెలుగు వైతాళికుల " విగ్రహాలు..తెలుగు సంస్కృతి మీద దాడి.. ఒకతను ముందుకెళ్ళి జాతీయ జెండా కాల్చేసినంత పని చేసారంట పింగళి వెంకయ్య గారి విగ్రహాన్ని ధ్వన్సం చేసి..జాషువా మీద దాడి బడుగు బలహీన వర్గాల మీద దాడి..చెప్తూ పొతే భారతం అంత సోది..అవను మహానుభావుల విగ్రహాలను కూల్చారు..బాధకలిగేదే..నా మొట్టమొదటి వ్యాసానికి బడి లో వచ్చిన బహుమతి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం..
ఎన్ని సార్లు అపురూపంగా చుస్కున్ననో ,చదివానో నాకింకా గుర్తుంది..వారి మీద గౌరవం తగ్గలేదు..కేవలం నా నేలన పుట్టిన కాలోజి కవితనో,దాశరథి పలుకునో నాకెవరు వినిపించలేదు అని బాధ తప్ప..జాషువ గారి విగ్రహం మీద ఉన్న అభిమానం,ఒక సోంపేట,ఒక కాకరపల్లి, హైదరాబాద్ రింగ్ రోడ్ ఇలా ఎన్నో దళితుల భూములు ప్రభుత్వం లాక్కుంటుంటే చూపించుంటే అందులో నిజాయితీ ఉండేది..దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటిన గురజాడ..600 మంది యువకులు తెలంగాణా లో మరణిస్తే ఉలుకు పలుకు లేని ఈ మేధావులు ,తన విగ్రహం మట్టి కోసం ధర్మాగ్రహం చేపట్టారంటే నిజంగా ఆయన ఆత్మా హర్షిస్తదా ...
దాడి చేసిన అసాంఘిక శక్తులు కూడా ఆ వ్యక్తుల మీద వ్యతిరేకత తోనో ,అవమానిన్చాలనో చేయలేదు..అవి కేవలం సీమంధ్ర పక్షపాత వైఖరికి నిలువెత్తు నిదర్శనం లా భాగ్యనగరం లో హేళన చేస్తూ,తెలంగాణా ను అపహాస్యం చేస్తూ నిలచున్న బొమ్మల్లా నిల్చుండి పోయాయి..ప్రాణ ప్రతిష్ట లేని దేవుని విగ్రహం కేవలం బొమ్మే,అలాగే ఆచరణ లో పెట్టని ఆదర్శాలు,ఆ మహానుభావుల ముసుగు పెట్టి మా చరిత్ర పై దాడులు,ఆ విగ్రహాలలో సీమంధ్ర పాలకుల అహంకారం తప్పితే ఏ మహానుభావుని ఆత్మా లేదు..దాడిని ఖండించొచ్చు ,కొంతమంది ముందుకెళ్ళి సిగ్గుపడోచ్చు..కాని శాసన సభ ను బహిష్కరించిన,పార్లమెంట్ ను స్తంభింప జేసినా నిమ్మకు నీరట్టని సర్కారు..రాష్ట్రం తగలబడిపోతున్న సమాధానం చెప్పడం అవసరం అనిపించుకోని కేంద్రం..తెలంగాణా లో ప్యాసిన్జర్ రైలు కదిలితే హైదరాబాదులో కుర్చీ కదులుతది అనుకునే ముఖ్య మంత్రి,రెండు కళ్ళు ,రెండు నాల్కెలు వ్యవహారం..ప్రజాస్వామ్యాని ప్రతి రోజు అపహాస్యం చేస్తుంటే స్పందించని మనుషులు,వాళ్ళ మనసులు,విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తున్నాయి..అన్నమయ్య విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ వెంకన్న నగలు దొంగాలించే సంస్కారం నిజంగానే తెలంగాణకు లేదు..ప్రేమించినంత కాలం ప్రేమించాం ..వద్దనుకుంటే మొహమాటం లేకుండా వదిలేస్తున్నాం..దొంగ భక్తుడి కన్నా నిజమైన నాస్తికుడు మేలు..
మాకు గౌరవం లేదు ,మీకుంది మీ ఆంధ్ర ప్రాతం లో పెట్టుకుంటే అడ్డుకుంటామా ,మా ప్రాంతం లో అది హైదరాబాదు లో పెట్టాలన్న పంతం ఎందుకు..మా కవులకు చోటు లేని మీ విగ్రహాలెందుకు..సయోధ్య తో ఇరు ప్రాంతాల వారివి పెడదాం అంటే కొంత ముందుకు రావొచ్చు..కాని మీ మీద ఇలాగె పెత్తనం చేస్తాం అంటే ఎలా ఉరుకుంటం..పది వేల మంది లో కుల్చింది పది మందే,మిగితవాళ్ళు అపలేదేందుకు? నిరసన ర్యాలీలు ఓ వరంగల్,ఓ కరీంనగర్ ,ఓ ఆదిలాబాద్ ,తెలంగాణా లో ఎక్కడా జరగలేదెందుకు.?మేధావులైతే మధించండి ,జరిగిన తప్పులు వాటి మూలాలు గ్రహించండి, సయోధ్య తో ప్రజాస్వామ్యాన్ని నిలపండి..మా శవాల మీద కూడా మీ సమాధులు కట్టుకునే సంస్కృతిని మార్చండి..మీ సమైక్య రాగం లో మా తెలంగాణా ఉంటె..మీ పుస్తకాల చరిత్ర మార్చండి..మా వీరోచిత తెలంగాణా చరిత్ర సీమంధ్ర పిల్లల తో చదివించండి..మీ కూడళ్ళలో మా రావి నారాయణ రెడ్డి,చాకలి ఐలమ్మ ,దాశరథి విగ్రహాలు పెట్టి పూజించండి.. మనుషులను వదిలేసి మట్టిని పట్టుకునే మనస్తత్వాన్ని వదిలేయండి..మా తెలంగాణా మాకొచ్చిన రోజు తెలుగు వైతాళికుల విగ్రహాలు మేమే పెట్టుకుంటాం,శ్రీ శ్రీ ని దాశరథి ని పక్క పక్కనే నిలబెట్టి మరి చూపిస్తాం..మద్యం అమ్ముకునే విజయ్ మాల్య గాంధీ స్మృతి చిహ్నాలను కొనిచ్చాడు..గాంధీ ఆశయాని వదిలేసి ఆయన వస్తువులు పట్టుకొని వేలడుతున్నాం..విగ్రహాల విలువ ఆ విగ్రహం సూచించే వ్యక్తి ని బట్టే కాదు,పెట్టిన మనిషిని బట్టి కూడా ఉంటది..నేను హత్య చేసి దాని పై బుద్దుని విగ్రహం పెడతా అంటే ఆ రక్తపాతం ధర్మమై పోదు..అయనా తెలుగు జాతి మనది కాని తెలంగాణా గోడు ఆంధ్రా కి అర్థంకాదు..చెట్టు మొదలు నీది ,పైన పండ్లు నావి అనే అన్నదమ్ముల ఆంధ్ర పంపక సూత్రం మాకు అర్థం కాదు..తెలుగు జాతే కాని వెలుగు జాతి మాత్రం కాదు..తన బిడ్డల రక్తం చూసిన చీకటి జాతి..
నాకు తెలిసిన ఒక రచయిత్రి రాసిన వ్యాసం 

14, ఫిబ్రవరి 2011, సోమవారం

విద్య -- ఇది ఒక మిధ్య

విద్య నేర్చని వాడు వింత పశువు అన్నాడో పెద్ద మనిషి .ఎందుకంటే విద్య నేర్చిన వాడికి జ్ఞానం కలుగుతుంది.ఒక నాడు గురువుకు సేవ జేసి విద్యనభ్యసించే వారు .నేడు విద్యార్ధి ముందుకు గురువు వచ్చి చెప్పినా వినే స్థితిలో లో విద్యార్థి లేడు.ఒక నాడు విద్య జ్ఞాన సముపార్జనకు ఎంత దోహదం చేసిందో ,ఇప్పుడు అదే విద్య ద్వారా నేర్చిన విజ్ఞానం మనిషి అస్థిరతకు అంత దోహదం చేస్తుంది.విద్యా ప్రమాణాలకి నెలవైన పాటశాలలు ,కళాశాలలు కనీస ప్రమాణాలకు నోచు కోవడం లేదు.విద్య నేర్పే గురువులు కనీస ప్రయత్నం చేయడం లేదు. విద్య నైపుణ్యం ఉన్న వారు విద్య పంచేందుకు బద్దకిస్తున్నారు నైపుణ్యం లేని వారు పిల్ల ల జీవితాలని బలి చేస్తున్నారు.ప్రాధమిక విద్య లో నేర్పిన బుద్దులు కళాశాల దశకు చేరే సరికి బ్రష్టు పట్టి పోతున్నై .జ్ఞాన భండారాలైన పుస్తకాల చదివే శ్రద్ద కనిపిచడం లేదు.ప్రాదమిక పాటశాలలో పాటించిన నియమాలు,సంప్రదాయాలు కళాశాలకు చేరుకునే సరికి మారి పోతున్నై .వందేమాతర జాతీయ గీతలపంతో మార్మోగే పాటశాల విద్యా దశ, గురుభో నమః అంటూ ప్రారంబించే తరగతులు ,స్వాతంత్ర్య గణతంత్ర్య దినోత్సవాలలో కనిపించే పోటీతత్వం అంత కళాశాల విద్య వచ్చే సరికి మంట కలిసి పోతున్నై .మంచి నడత నేర్పే గురువులకు విద్యార్ధి దృష్టిలో ఎప్పటికి చిరస్మరణీయుడు.
     కళాశాల విద్య కత్తి మీద సాము లాంటిది .కళాశాల విద్యలో గురువుకి గురువే గొప్ప అనుకుంటాడు .విద్యార్థికి విధ్యార్దే గొప్ప అనుకుంటాడు .గురువు ఎలా చెబుతున్నాడో ,ఏమి చెబుతున్నాడో విద్యార్థికి అవసరం లేదు.విద్యార్ధి ఎలా చదువుతున్నాడో గురువుకి అవసరం లేదు.నా దృష్టిలో విద్య లో ఎంత ఎత్తుకు ఎదిగిన గురువు స్థానం గురువుదే శిష్యుడి స్థానం శిష్యుడిదే .మహనీయుల గొప్పదనం మార్మోగిన చెవుల్లో ఒక్క సారిగా ఏదో మార్పు.గురువు చెప్పేదే వేదంగా పరిగణించే తెలివి నేర్చిన బుర్రలు అతి తెలివిని ప్రదర్శిస్తాయి .ఎంతో మార్పు సంభవిస్తుంది .ఎంతో తెలివిగల విద్యార్థి అథః పాతాళానికి కురుకు పోతాడు అథః పాతళం లో ఉన్న విధ్యర్హి అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తాడు .
 మొదటి దశలో అహర్నిశం ప్రాధమిక విద్యా పద్దతులు అవలంబిస్తాడు .విద్యార్థి అవగాహన రాహిత్యం గురుశిష్యుల సమన్వయ లోపం తో అసలు సమస్య మొదలవుతుంది .ఈ నాటి విద్యా ప్రమాణాలు ఏ  విధంగా ఉన్నాయంటే మూలల నుండి ఆలోచిస్తే 1 టవ తరగతిలో తల్లి దండ్రులు తెలుగు మాద్యమమ ఆంగ్ల మాధ్యమమా? అనే సందేహం తో మొదలై 10 వ తరగతి కి వచ్చాక గనితమా?సామన్య శాస్త్రమా? అనే రెంటికే పరిమిత మవుతుంది ఆలోచించే వారు ముగ్గురవుతారు .అందరు కేంద్రీకరించిన వైద్యం (medicine), సాంకేతిక విద్య (engineering) లో ఏదో ఒకటి నిర్ణయించుకుంటారు .ఆ నిర్ణయం తీసుకున్నాక సమస్యల వలయం లో అడుగుపెడతారు (ఇంజనీరింగ్ /మెడికల్ కాలేజీ ) .అందరి దృష్టి ఈ రెండింటి మీదనే ఉన్నప్పుడు ఇటు వైపే ఆకర్షితులవుతారు .కాని ఆ ఆకర్షణకి తగిన ప్రమాణాలు పాటించే కళాశాలలు చాల అరుదు. ఈ సమస్యా నిలయాల్లో కావాల్సింది గురు శిష్యుల మిశ్రమ అధ్యయనం ,శోధన. కాని అవేమి జరగవు .నిమిషాల్లో కనీస ప్రాధమిక సమాచారం అందించే వెసలుబాటు ,సాంకేతిక పరిజ్ఞానం ,సౌలభ్యాలు ఇన్ని ఉన్నా ,ఇంత అభివృద్ధి జరిగినా గురువు చేసే పని గురువు చేయదు,శిష్యుడు చేసే పని శిష్యుడు చేయడు.గురువు చెప్పలేదని శిష్యుడు ప్రయత్నించడు.శిష్యుడు ప్రయత్నించాలి అని గురువు చెప్పడు.
      శోదించే పరిజ్ఞానం  లేని రోజుల్లో  పరిశోధనలు  ఎన్నో జరిగాయి శోదించే పరిజ్ఞానం అర చేతిలో ఇమిడి ఉన్న పరిశోధనలు జరగడం లేదు .ఎన్నో సమస్యల నిలయాల్లో కనీస సౌకర్యాలు ,నేర్పు కలిగిన అధ్యాపక బృందం కొరత ఒక కారణం అయితే ,అవినీతికి అలవాటు పడ్డ అధికారులు అడ్డగోలుగా ఇచ్చిన అనుమతులతో పుట్ట గొడుగుల్లా పెరిగిన సమస్యానిలయాలు మరొక కారణం .వీళ్ళ అవినీతి వల్ల సరస్వతీ నిలయాలు సమస్యా నిలయాలు గ మారుతున్నాయ్.ఇక పోతే ఈ సమస్యల నిలయాల్లో విద్యా ప్రమాణాలు ,గురుశిష్యుల అనుభందాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది .గురువు పాఠాలు చెప్పే పద్దతినుండి విద్యార్థి పరీక్షలు రాసి గణాంకాలు ఇచ్చే  వరకు అన్నీ  విద్యార్థికి అనుకూలంగా నడిస్తేనే విద్యార్థి దృష్టిలో గురువు మంచి వాడు.గురువు కి విసుగోచ్చినా పాఠాలు జరగవు విద్యార్థికి విసుగోచ్చినా పాఠాలు జరగవు .పరీక్షలు రాయరు. కనీసం ప్రాథమిక అంశాలు తెలియ కుండా దొంగ దారిలో ఉత్తీర్ణుడై  ఒక విద్యార్థి బయటి ప్రపంచానికి వచ్చి మనిషి అస్త్తిరతకు  ఎంతో దోహదం చేస్తున్నాడు. సాంకేతిక విద్య నేర్చిన విద్యార్ధి ఈ నాడు ఏ మోతాదులో ఏ పరమాణువులు కలిస్తే ఏ పదార్ధం ఏర్పడుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నాడు.ఏ నాడి ఎక్కడుందో తెలియని వైద్యుడి గా ఉన్నాడు.ఏ మందు ఎందుకు ఇవ్వాలో తెలియని మందుల కంపెనీ లో ఉద్యోగిగా ఉన్నాడు.ఏ చట్టం ఎందుకు పనికి వస్తుందో తెలియని న్యాయ వాదిగా ఉన్నాడు .కావున మనిషికి మున్ముందు సాంకేతిక పరంగా ,వైద్య పరంగా, ఆరోగ్య పరంగా ,న్యాయ పరంగా అన్నీ అవరోధాలే ,ప్రతికూల పరిస్తుతులే .

 కావునా విద్యార్థీ మేలుకో -------- నిజమైన గురువు ఎవరో తెలుసుకో
గురువు మేలుకో --------------- విద్య నీ బాధ్యత గుర్తుంచుకో
యాజమాన్యం మేలుకో --------- గురువు,విద్యార్థులకు న్యాయం నిర్వర్తించుకో
ప్రభుత్వమా మేలుకో --------- అవినీతి అధికారులకు కొమ్ము కాయడం మానుకో





1, ఫిబ్రవరి 2011, మంగళవారం

జోరు మీదున్నావు తుమ్మెద

జోరు మీదున్నావు తుమ్మెద నీ జోరేవారి కోసమే తుమ్మెద
అని paతా అయితే పాద గలను గాని
నా మనసంతా బేజారుగా ఉన్నది
నా మనసు చేజారి ఇన్నాళ్ళయినా
నీ చేజేత  ఎన్నడు ఆద రించవయితివి

26, నవంబర్ 2010, శుక్రవారం

ప్రేమ ఇక నువ్వు దరి చేరవ?

అడుగు అడుగున నీ ఆలోచనలే
అను నిత్యం నీ స్మరణే
ఆనందం పంచిన నీవు
ఆవిరై పోయావు ఎందుకు ?
నా ప్రేమను చులకన గ చేసి
నన్ను దూరం చేసావు ఎందుకు ?
ప్రేమ ఇక నువ్వు దరి చేరవ?
ప్రేమించే నన్ను నీ వాడిని కానివ్వవ?

రాయిలా మారింది హృదయం

రాయిలా మారింది హృదయం
రాగాన్ని మరిచింది గానం
అనురాగాన్ని పంచె తోడు లేనప్పుడు
అను నిత్యం ఆవేదనే
ప్రతీకారం దేవునిదా?
ప్రతిఫలం ఇంత మంది జీవితాలద?

ప్రేమ వదిలి వెళ్ళింది

నన్ను ప్రేమ  వదిలి వెళ్ళింది
నేను ప్రేమను వదల కున్నాను
కరిగి పోతూనే ఉంది కాలం
ఏ కాకి గానే ఉండాలా కల కాలం?
దైవ నిర్ణయానికి అంతం లేదా?
దీపం పెట్టె దేవత దరి చేరద?

గురువు

శివుడి ఆజ్ఞ తో
విష్ణువు ఆయువుతో
బ్రహ్మ రాసిన తల రాతతో
శిశువు జన్మిస్తే
తల రాతను మార్చేది గురువు
తల్లి జన్మ నిస్తే
తండ్రి నడక నేర్పిస్తే
నడిచే దారిని మంచి చేసేది గురువు

జీవితాంతం ఏకాకినే

నీవు చేసిన గాయం మాన్పెందుకు 
నీవు దూరం చేసిన ఆనందాన్ని తిరిగి ఇచ్చేందుకు 
దేవుడు పంపిన ఆత్మీయ భందువు 
ఏ క్షణం నా దగ్గరవుతుందో నని వేచి ఉన్నాను 
నీవు అడ్డురానంత వరకు తను నా సొంతమే 
అడ్డు వస్తే నేను జీవితాంతం ఏకాకినే

ప్రేమ నా అభిప్రాయం

ప్రేమ ఈ పదం ఎలా రూపం చెందిందో గాని ఆ పదాలను చుసిన విన్న ఏదో అందుర భావన మదిలో ఎవరు లేకున్నా ఆ పదం వినగానే ఎవరో మన మనసులో నిండి పోయారన్న ఒక స్పందన .ప్రేమను ఎందఱో ఎన్నో విధాల నిర్వచించి అలసి పోయారు . ఏ అర్థం దానికి చెప్పిన ఇంకేదో కొత్త అర్థం ఇవ్వాలని అని పిస్తుంది .ప్రేమ మనసుకు సంభందించినదా లేక మనిషి కి సంభందించినదా అని ఆలోచించిన సమాధానం రాదు.ఒక్కొకరికి ఒక్కో భావన .
 ప్రేమ పుడుతుంది  పెళ్లి అవుతుంది .మనిషి జీవితం లో జన్మించటం మరణించటం వీటికి ఉన్న ప్రాధన్యత ఎంతో అందరికి తెలుసు. ప్రేమ ఎన్నటికి పుడుతుందే తప్ప మరణించది.మనిషి రూపం లో మరణించిన మనసు రూపం లో అది ఎన్నటికి శాశ్వతం .ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని ఎప్పుడో ఒక ప్పుడు ప్రేమించే ఉంటారు కాని ఆ నిజాన్ని ఒప్పుకోరు .ప్రేమించటం అంటే ఏదో తప్పు చేసామన్న భావన ఇంకా సమాజం లో ఉంది.
  ఎవరి మదిలోకి ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో తెలియకుండానే జరిగి పోతుంది ఎన్ని ప్రేమ కథలు మనం చుసిన ఏదో ఒక కొత్త దనం కనిపిస్తుంది. ఎందుకు ప్రేమిస్తున్నాం అనే దానికి జవాబు దొరకక పోవడమే నిజమైన ప్రేమ .అంత రాత్మను మోసం చేసుకుని జీవితాంతం బ్రతికి చావడం కంటే,అంత రాత్మ లో నింపుకున్న ఆ ఆత్మకు అను నిత్యం తోడుండి కల కాలం బ్రతకటం మంచిది. ఎవ్వరు మనసును మోసం చెయ్యద్దు అనుకుంటూనే మోసం చేస్తున్నారు. ప్రేమించిన వారికి ప్రేమను తెలియ జేయడం చాల ముఖ్యం .ప్రేమను ధైర్యంగా చెప్పక పోతే లక్ష్మి మన సొంతం కాదు.అమ్మాయిలైనా ,అబ్బాయిలైనా ప్రేమను వ్యక్త పరచాగలిగే ధైర్యం ఉండాలి.
   ఎన్నో విధాల వ్యక్త పరచగలది ఒక పేమ మాత్రమే. మనసు పవిత్రంగా ఉన్నంత వరకు మన అధీనం లో మనం ఉన్నత వరకు ప్రేమ చాల గొప్పది . ప్రేమించడాని కచ్చితంగా ఒక నిర్ణీత వయస్సు కావాలి .తిన్న ఆహారం విసర్జించక పోతే ఎంత ప్రమాదమో ప్రేమను వ్యక్త పరచక పోతే కూడా అంతే ప్రమాదం.ప్రేమను వ్యక్త పరచటం లో అమ్మాయిలే నిజంగా ధైర్య వంతులు.అబ్బాయిలని ఎక్కువ గ ప్రేమించి తక్కువగా అర్థం చేసుకోవాలి కాని అమ్మాయిలని తక్కువగా ప్రేమించి అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేసినా వారు అర్థం కారు ఎందుకంటే "ఆడ వారి మాటలకు అర్థాలే వేరులే". ప్రేమికులలో ఉండే భావనలు ఎలా ఉంటాయి అంటే ,వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే ,తన ప్రేయసిని ఇంకో అబ్బాయితో మాట్లాడితే అమ్మాయిని అనుమానిన్చినట్టు .కాని అబ్బాయి ఇంకో అమ్మాయితో మాట్లాడ వద్దు అంటే మాత్రం అది అబ్బాయి మీద ఉన్న అతి ప్రేమ అని అంటారు.
 ఈ రోజుల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ప్రేమలో ఎక్కువ స్వచ్చత చూపిస్తున్నారు .

18, ఆగస్టు 2010, బుధవారం

కష్టా లన్నీ నాకే

కష్టా లన్నీ నాకే ....! కష్టాలు వచ్చ్సినపుడు ప్రతి మనిషి నోట వచ్చే మాట ఇది.కాని అదే  సుఖాలు వచ్చినపుడు సంతోషాలన్నీ నాకే అని అనలేడు. కష్టం  వచ్చినపుడే మనిషిని సృష్టించిన దేవుడు .మనిషి సృష్టించిన డబ్బు ,మనిషి కి తోడు గ ఇంకో మనిషి గుర్తు వస్తాయి. అక్కరకు వస్తాయి .సంతోషాన్ని స్వీకరించినంత ఇష్టంగా కష్టాన్ని స్వీకరించలేదు మనిషి .కష్టం లేనప్పుడు సుఖం విలువ తెలియదు. ఈ విషయం లో దేవుడు సృష్టించిన మనిషి కంటే మనిషి సృష్టించిన డబ్బు కే విలువ ఎక్కువ  అయింది .పెద్ద మనసు చేసుకుని ఒక పెద్ద మనిషి మనస్పూర్తిగా సాయం చేసినా అది దైవం యొక్క ఆశీర్వాదం అని అనుకుంటున్నాం.పాపలు చేసిన వాడికే కష్టాలు  కల్పిస్తాడ దేవుడు?లేక దేవుడు పరీక్ష పెట్టడానికి కష్టాలు కల్పిస్తాడ? ఏది ఏమైనా కష్టాలు వచ్చినపుడు తట్టుకోవడం చాల కష్టం.
         సుఖం ఉన్న చోట మనిషికి విలువ  ఉండదు.సుఖం అంటే ప్రస్తుతం చేతి నిండా డబ్బు ఉండటమే అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది.డబ్బు అవసరం లేని మనిషి ఉండదు.అదే పద్దతిని దేవుడికి అంట గట్టేస్తున్న్రు. ఈ రోజుల్లో దైవ దర్శనం కూడా డబ్బుతోనే ముడి పది ఉంది.అమాయుకులైన చిన్న పిల్లలు సహితం ఒక్క రూపాయి ఇస్తేనే  మనతో సంతోషం పంచడానికి ముందుకు వస్తారు .ప్రపంచం అంత పొట్ట కుతి కోసం కోటి విద్యలు నేర్చారు అనేకంటే డబ్బు సంపాదించడానికే కోటి విద్యలు నేర్చారు అనడం లో అతిషేయోక్తి లేదు .డబ్బు లేని వానికి ఆకలి ఎక్కువ డబ్బులున్న వాడికి అసలు తినే సమయం తక్కువ .ఎంత విచిత్రం ఇక్కడ కోటి విద్యలకు ,కూటి ఆకలికి ఎంత సంభందం ఉంది?
        డబ్బు లేని వానికి కష్టాలు ఎక్కువ సుఖం తక్కువ .ప్రతి రోజు ఉన్న కోటి విద్యల్లో ఏదో ఒక విద్య ఉపయోగించి కష్టపడి ,పొట్ట నిండా తినకున్న సుఖంగా నిద్రపోగాల్డు.నిద్ర విషయం లో డబ్బు లేని వానికే సుఖం ఎక్కువ .డబ్బు ఉన్న వానికి ప్రతి రోజు ఈ రోజు డబ్బులెలా వస్తాయి అనే ఆలోచన ఉండదు కాని తినడానికి సమయం ఉండదు.సుఖంగా జీవించడానికి అన్ని సదుపాయాలూ ఉంటాయి కానీ ఉన్న డబ్బు నే ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన తో సుఖంగా నిద్ర పోలేడు,తిన లేడు.కష్టం దేవుడిచ్చిన శాపమా?సుఖం దేవుడిచ్చిన వరమా తేల్చడం కూడా మరో కష్టం .కాబట్టి సుఖం ఎంత ముఖ్యమో ,కష్టం కూడా అంతే ముఖ్యం.ఎప్పుడు సుఖాలు ఉంటె కష్టం వచ్చినపుడు తట్టుకోవడం వాళ్ళ కాక ఎలాంటి అఘాయిత్యానికైనా పాలపదతాడు మనిషి.కష్ట సుఖాలు రెండు జీవితం లో అవసరమే.
 


 

20, మార్చి 2010, శనివారం

ప్రేమ పెళ్లి -పెద్దల పెళ్లి

           ప్రేమను పంచి ,ప్రేమగా చూసుకునే తోడు లభించిన నాడు ఎంతో అదృష్టం .ఎవరు ఎన్ని చెప్పిన వినిపించని మనిషికి తోడు మనసు .ప్రేమలో పడితే సర్వస్వం ప్రేమించిన మనిషే .తీసుకున్న నిర్ణయం ఆలోచన ఉంది తీసుకున్నప్పుడు ఉన్న ధైర్యం  ఎంతకైనా తెగించేలా చేస్తుంది.ఎవరిఅనైనా ఎదిరించేలా చేస్తుంది .ప్రేమ పెళ్లి కి ,ప్రేమికులకు సమాజం లో ఎప్పుడు చిన్న చూపే .పంచె ప్రేమ నిస్వార్థం గా ఉన్నన్ని రోజులు ఎవరు ఎన్ని చెప్పినా ,ఎవ్వరు విడదీయ లేరు. మరి ఈ పిల్లల ప్రేమకి  ఎన్నో అడ్డంకులు ఏదో ఒక రూపం లో ఉండనే ఉన్నాయి. తల్లిదండ్రులు పంచె ప్రేమను మరచి ప్రేమికులు తమకు తాము ఎన్నో ఊహించుకుంటారు .ప్రేమికుల దృష్టిలో ఒకరంటే ఒకరికి ఎంతో నమ్మకం మున్ముందు జీవితం లో ఎలా ఉంటారో అనే ఒక మానసిక సంఘర్షణ పెద్దలను ఎప్పటికి వేధిస్తుంది .ఆ ఆవేదనే ప్రేమికుల ప్రేమకు అడ్డుగా నిలుస్తుంది .తల్లి దండ్రుల అనుభవం ,ప్రేమికుల అనురాగం ఈ రెంటి మధ్య మొదలయ్యే యుద్ధం ఎవరికీ వారు తమ తమ నిర్నయాలనుంది సడలరు. ప్రతిఫలంగా ప్రేమికులైతే ఒకటవు తారు కాని ,పెద్దల దృష్టిలో దోషులవుతారు .ప్రేమ పెళ్లి పెద్దల పెళ్ళిగా మారితే ఆ ఆనందం అందరిది .

    ప్రేమించిన వారిని ఎందుకు,ఎప్పుడు ప్రేమించామో తెలియదు .ఈ నిమిషంలో మనసులో ఆ అనుభూతి కలుగుతుందో,ఆ నాటి నుండి పెద్దల దృష్టిలో వాళ్ళు దొంగలు.ప్రేమికుల దృష్టిలో వాళ్ళు భావిష్య్యతు  గురించి బేరీజు వేసుకునే అంశాలు చాల తక్కువ .కాని ఇక్కడ ఉన్న ఒక సదుపాయం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ,ఏ నాడు అయితే ఆ అర్థం ,అపార్థం అవుద్దో ఆ నాడు ప్రేమికులు విడి పోతారు.ఈ విషయం లో నే పెద్దలు ఆందోళన చెందేది .పెద్దలు నిర్ణయించే పెళ్లి లో వారి అనుభవాన్ని జోడించి జీవిత భాగస్వామిని నిర్ణయిస్తారు .పెద్దల పెళ్ళిలో నిర్ణయాలు తీసుకునే సర్వాదికారం పెద్దలవే. ఎన్ని సంభందాలు చూసినా ,అమ్మాయి అబ్బాయిలు తీసుకోవాల్సిన నిర్ణయం ఒక్కటే అది ఒకరికి ఒకరికి నచ్చటం ఇక్కడ అమ్మాయి ,అబ్బాయి అందానికి ఒక ప్రాధాన్యత అయితే (ఈ ఒక్కటి మాత్రమె పిల్లల నిర్ణయం )ఆస్తి ,అంతస్తులు ,కట్నం మరో అంశం .ఒకరికి ఒకరు నచ్చినా పెద్దలు తీసుకునే నిర్ణయమే ముఖ్యం .ఇక్కడ పెద్దలు ,పిల్లల దృష్టిలో దోషులవుతారు అలాగని పెద్దలని తప్పు పట్టాల్సిన పని లేదు .ఎందుకంటే పెద్దలు ఆలోచించేది పిల్లల భవిష్యత్తు గురించే .ప్రేమ పెళ్లి లో ప్రేమికులు అసలెందుకు ఇలా చేస్తున్నారో అని పెద్దలకు అర్థం కాదు. పెద్దల పెళ్ళిలో పిల్లలకు పెద్దలు ఇలా ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు .ప్రేమ పెళ్లి లో ప్రేమికులు ఒకరికి ఒకరు నచ్చి ,అర్థం చేసుకుని పెద్దలకు నచ్చ జెప్పినా పెద్దలకు ఆ ప్రేమ అర్థం కాకున్నా పెళ్లి జరుగుతుంది కాని పెద్దల పెళ్ళిలో ఒకరికి ఒకరు నచ్చినా పెద్దలకు అర్థం(కట్నం ) అయితేనే పెళ్లి జరుగుతుంది.




     

 

13, మార్చి 2010, శనివారం

అభిమానాన్ని పంచేది

అభిమానాన్ని పంచేది
ఆనందాన్ని ఇచ్చేది నీనైతే
అలుసుగా చూసేది
ఆత్మీయతను చంపేది నీవు
చూపించిన ప్రేమనంతా
ఛీ కొట్టి పోయావు
మురిసిన మనసులో అంత
అలజడే సృష్టించావు
చచ్చిన పామునే చావా బాదే
ఖతినాత్మురాలిగా మారావు.

పలికించు నీ నాదం

పలికించు నీ నాదం
పది మందికి వినిపించేలా
మానస సరోవరం
మరోమారు ఉప్పొంగేలా
కోయిలమ్మ గానం లా
మైమరపించే నీ సరాగం
గొంతెత్తి పాడే సమయం
గోకులమంత పరవశం
నలు దిక్కులా నీ నామం
మారు మ్రోగాలి ఈ యుగాంతం

అమ్మ నా ఆనందాన్ని

అమ్మా నా ఆనందాన్ని ఆపింది ఎవరు ?
ఆటలాడే చిన్ని తనాన్ని చిదిమింది ఎవరు ?
ఇల్లు నే ఒక భందిఖానగా మార్చింది ఎవరు ?
ఈ రోజు ఆడుకో అని చెప్పేది ఎవరు ?
ఉడుతలా గెంతకుండా చేసింది ఎవరు ?
ఊయలూగుటకు స్థలం లేకుండా చేసింది ఎవరు?
ఎన్నాళ్ళు ఉండేది ఈ బాల్యం ?
ఎం కావాలి నా భవితవ్యం ?
ఒళ్ళు అలవకుండా
ఓనమాలు ఎలా దిద్దటం
ఔదార్యం లేని చదువెందుకు చదవటం ?
అందరు ఆలోచించండి
ఆః అనేలా మము తీర్చిదిద్దండి .

10, ఫిబ్రవరి 2010, బుధవారం

తెలంగాణా రాజకీయాలు

తెలంగాణా రాజకీయాలు

తెలంగాణా ఉద్యమం ఘన చరిత్ర సృష్టించడానికి జరుగుతుందా? తెలంగాణా రాష్ట్ర సాధన కోసం జరుగుతుందా? ఐక్య కార్యాచరణ సమితి అంటే అంత ఐక్యంగా ఉండడమే కదా? అలాంటప్పుడు మల్లి ఇందులో విభజించబడిన ఐక్యత ఎందుకు ? రేపు తెలంగాణా వస్తే కూడా ఉండేది ఇదేనా?ఇప్పుడే సమయం దొరికినాటు కొంత మంది అప్పుడే కులమతాల గురించి సభాముఖంగా తగువులాడుతున్నారు."ఆలు లేదు చులు లేదు కొడుకు పేరు సోమలింగం లా ఉంది పరిస్థితి." ఎవరికీ వారు ఐక్య కార్యాచరణ సమితి అంటున్నారు కాని ఐక్యత మాత్రం లేదు.అసలు ఇలా ఎవరికీ వారు ఐక్య కార్యాచరణ సమితి స్థాపించడం ఎందుకో ? కార్యం సాధించడానికా లేక మరి దేనికోసం?

అటు సీమంధ్ర వాళ్ళు ఇంకా ఏదో చేద్దామని పరుగులు తీస్తున్నారు ఎందుకో? చరిత్రను పట్టుకుని వేలాడుతున్నామని నిదించినా,భవిష్యత్తు కి నమ్మకం ,ఆశ, స్థైర్యం లేదనే తెలంగాణా ఉద్యమం జరుగుతుంది. ఇన్నాళ్ళు జరగనిది ఇక ముందు ఎలా జరుగుతుంది అనే ఈ ఉద్యమం .ఈ ఉద్యమం లో సమిధలైన విద్యార్థులు కోసం అయినా సీమాంధ్రులు మారుతార? మారారు. రాజీనామా చేస్తే తెలంగాణా వస్తుంది రాజీనామా చేయమంటే ,రాజకేయ సంక్షోభం వస్తుంది,ప్రభుత్వం పడిపోద్ది,రాష్ట్ర పతి పాలన వస్తది అని అంటున్నారు .రాజకీయ నాయకులు.మరి ఈ విషయం ఇంతకు ముందు రాజీనామా చేసినప్పుడు తెలియడ? తెల్నగన రాజకీయ నాయకులు రాజీనామా చేస్తే ,రాజకీయ సంక్షోభం వచ్చి ,రాష్ట్ర పతి పాలనకి దారి తీస్తే మరి ఇది సీమంధ్ర రాజకీయ నాయకులకు వర్తించద?
గోడ మీద పిల్లి ల వ్యవహరిస్తున్న పార్టీలు ,కేంద్రం విద్యార్థులు జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఈ బలిదానాలు కొంత మంది సీమంధ్ర పాలకులకు క్రికెట్టు స్కోఋ లా కనిపిస్తున్నాయి . ఆత్మ హత్యా చేసుకుంటే అదేమైనా గొప్ప ?అని అడిగే సీమంధ్ర గొంతులు ఉన్నాయి.సమైక్యత రాగం అందుకున్న సీమంద్రుల ఉద్దేశాలేంతో తెలంగాణా ప్రజలకు బాగా తెలుసు .తెలంగాణా అభివృద్ధి చెందినదా ,హైదరాబాద్ అభివృద్ధి చెందినదా?ఎవరి అభివృద్ధి దేనికి కారణమైంది ?హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణా ప్రజల పొట్ట కొట్టి ,నోట్లో మట్టి కొట్టి చేసిందే ఈ అభివృద్ధి అంత.కొన్ని పార్టీలు సామాజిక తెలంగాణా కావలి అని ,సీమంధ్రులు చేపట్టిన ఉద్యమాన్ని చూసి ప్రజల్లో ఇంత బలమైనా కోరిక ఉండనుకోలేదు అంటున్నారు.మరి తెలంగాణా వాళ్ళు ప్రజలు కాదా?

సీమంధ్రలో ,వారసత్వంగా ఆస్తులు ఇష్టరేమో కాని ,తెలంగాణా లో పోరాటాలను వారసత్వంగా ఇస్తారు .తెలంగాణా అంత ఉద్యమ చరిత్రే.షరతుల ప్రకారం తెలంగాణా లో కలిసిన సీమంధ్రులు పదే పదే షరతులను ఉల్లంఘిస్తారు .విడి పోవడానికి మాత్రం ఒప్పుకోరు . సీమంధ్ర పాలకుల స్వీయ అభివృద్ధి ని హైదరాబాద్ అభివృద్దిగా చూపుతూ సమైఖ్య"ఆంధ్ర" కావాలని మూర్ఖంగా మాట్లాడుతున్నారు.తెలంగాణా ఉద్యమం తెలంగాణా రాష్ట్రం వచ్చాకే ఆగి పోతుంది .ఇప్పటి పరిస్థితులు తెలంగాణా రావడానికి దారి తీయకున్న ఈ ఉద్యమం మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది .సీమంధ్రులు ఏదైనా మాట్లాడేది ఉంటె మా పొట్ట కొట్టి వారు అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్న హైదరాబాద్ గురించి మాట్లాడాలి కాని, సమైఖ్యాంధ్ర గురించి కాదు.