28, డిసెంబర్ 2009, సోమవారం

నా పక్కన ఉండే పరమేశ్వరి గ పంపుతాడు నిన్నే

జోరు మీదున్నావు తుమ్మెద నీ జోరేవారి కోసమే తుమ్మెద
అని paతా అయితే పాద గలను గాని
నా మనసంతా బేజారుగా ఉన్నది
నా మనసు చేజారి ఇన్నాళ్ళయినా
నీ చేజేత ఎన్నడు ఆదరించావయితివి
నెల్లూరి నెరజాన అని విన్నదే కాని చూసింది లేదు
ఆ రూపం నీలో చూసుకుంటున్నాను
రోజా వాడినా ,నీ ముఖం చిన్న బోయినా నేను చూడలేను
ఎ పువ్వు తో నిన్ను ఎలా పోల్చినా
ప్రతి పువ్వులో నిన్నే చూసుకుంటా
నీ నవ్వునే వాటి సువాసనా మధురిమగా ఆస్వాదిస్తున్నాను
వారం లోని ఏడు రోజుల్లో ఒకే రోజు నా ఇస్తా దైవాన్ని ఆరాధిస్తాను
మిగిలిన రోజులన్నీ నా దేవి ధ్యానం లో నే గడుపుతాను
ప్రతి రోజు నే పల్లవి కట్టే ప్రతి పాటలో
నీ నామం పలకనిది ముగించాను
ఏదో విధంగా ఎదురైతే వస్తావు కాని
నీతో మాట్లాదేందుకు వీలు కల్పించవు
నన్ను సృష్టించిన ఈశుడే ఉంటె
నా పక్కన ఉండే పరమేశ్వరి గ పంపుతాడు నిన్నే

23, డిసెంబర్ 2009, బుధవారం

మళ్లీ మోసం

మళ్లీ మోసం

ఆంధ్ర వాళ్ళు అనుకున్నది సాధించారు. సీమాంధ్ర మంత్రుల భేటిలో మరి మాటలే జరిగాయో కేంద్ర ప్రభుత్వానికి మూట లే అందాయో. లంగడ పాటి లంగా దీక్ష చేస్తున్నప్పుడు,మిగితా నాయకులు దొంగ దీక్షలు ఒక్కొక్కరు గ విరమిస్తుంటే మనం అర్థం చేసుకోలేక పోయాం .వారంతా కోట్ల కి పడగలేతినా ఇంకా దీక్ష చేసి విరమించింది ఈ ప్రకటన వస్తుందన్న ధీమాతోనే కావచ్చు. మరి ఆ మూటలు తెలంగాణా పాలకులకు అందాయో ,లేదో అందితే రాజీనామా చేయరు .అందకుంటే, అందేలా రాజీనామా చేస్తామని బెదిరిస్తారు కాని చేయరు .అది మన తెలంగాణా పాలకుల నోరు ఇలా డబ్బు తో నొక్కేస్తున్నారు కాబట్టే ఇక్కడ ఇన్నాళ్ళు మోసం జరిగింది .ఇక కూడా జరగ బోతుంది.

మన ప్రజల కష్టాలు వీరికేం పట్టింది? డబ్బుకి ఎవరైనా దాసోహం కదా .తెలంగాణా పాలకులు రాజీనామా చేయక పోతే మనం ఎంత చేసినా వృధా .వారు రాజీనామా చేయక పోతే తెలంగాణా లో తిరగనీయ వద్దు. సమైఖ్య "ఆంధ్ర" ఉద్యమం ప్రజల నుండి వచ్చిందట మనం కామ ప్రజలం .మనం చేసేవి ఉద్యమాలు కావ? ౬౦ 60 ఏళ్ల పోరాటాన్ని నీరు కార్చి ,నీరు ,నీడ దోచేస్తుంటే కేంద్రానికేం పట్టింది .మన ఖర్మ కాలి ఆ నాడు ఆంధ్ర తో కలిపేసారు .డబ్బు మదం తో పీల్చి పిప్పి చేసారు .పిప్పిని కూడా వదలకుడదని ప్రతిన బునారు .
ఉన్నవి ,లేనివి అని కాకుండా ప్రతిదాని మీద ఆంధ్ర అని ముద్ర వేస్తుంటే ఇన్నాళ్ళు ఊరికే ఉన్నామని మనకీ శిక్ష విధిస్తున్నారు .చందా,ప్రచండ శాసనుడి గా ,ఐరన్ లెగ్ శాస్త్రి గా రోశయ్య కి బిరుదు ఇస్తే సరిపోతుందేమో. ఆంధ్ర వాళ్ళ నమ్మకం ఎంత గా ఉందంటే మన(తెలంగాణా) డబ్బు తో ఏదైనా చేయగలుగుతాం అని .ఎప్పుడైనా ముఖ్య మంత్రులు సీమాంధ్ర నుండి కదా ఉంటారు మాకేంటి వచ్చే నష్టం అని అంటున్నారు.మన పోరాటం మన తాతల నుండి మన ముని మనుమల దాక సాగినా తెలంగాణా రానివారు ఈ ఆంధ్ర పాలకులు .కోట్లకు పడగలెత్తిన లంగడ పాటి ,జ చ ,జగన్ లాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు సీమాంధ్ర పాలకుల కింద మనం బానిసలమే.బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా లేని మనం వీరి వద్ద బానిసలుగా ఉండాల్సి రావడం మన దురదృష్టం.

నిజాం చేసింది మన మీద దాష్టీకమే కావచ్చు .అది మనం చూడలేదు కాని ఈ ఆంధ్రుల దాష్టీకం నిజాం ని మించి పోయింది కావచ్చు.ఒక విధంగా మనకు నిజాం మేలు చేసాదేమో లేకుంటే నిజాం ని కూడా ఆంధ్ర తెలివి చూపించి ఈమి మాయం చేసేవారో ?ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆసుపత్రులు ,ప్రభుత్వ భవనాలు ,చారిత్రక కట్టడాలు కూడా ఉండేవి కావేమో.ఉదయం మన జన్మ హక్కు లా మారి పోయింది .ఒక ప్పుడు నిజాం దాష్టీకానికి తట్టుకోలేక (బండెనక బండి గట్టి ,పదహారు బండ్లు గట్టి ఎ బండ్ల పోతావ్ కొడుకో నిజాం సర్కరోడా అని పాడుకున్నాం) చేసాం ఇప్పుడు ఆంధ్ర పాలకుల దాష్టీకం తట్టు కోలేక చేస్తున్నాం.వీరి నుండి ఎప్పుడు మనకు విముక్తి ?అప్పుడు మళ్లీ పాడాలి బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఎ బండ్ల బోతావ్ కొడుకో సీమాంధ్ర సర్కరోడా అని.

మనం చేసే పనులకు ఎం ఎం సి కంపెనీలు రావట్లేవత ఎందుకు వస్తాయి అక్కడ కూడా ఉంది వారే కదా ఎందుకు వస్తారు. హైదరాబాద్ పేరు చెప్పి స్వీపెర్ పదవి కూడా తెలంగాణా కి ఇవ్వరు. ఇంటర్వ్యూ కి పిలుస్తారు తర్వాత పిలుస్త మంటారు పిలవరు.ఎన్ని చూడలేదు ఇలాంటివి? నాలుగు రోజుల క్రితం హి చ ఎం టి వి వారు చేసిన ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేయదు?
కొంత మంది అంటారు తెలంగాణా వస్తే అభివృద్ధి జరగదని ఇపుడు మాత్రం ఏమి అభివృద్ధిజరిగింది? స్వాతంత్ర్యం ఇస్తే భారత దేశం అభివృద్ధి జరగదు అని ఆంగ్లేయులు అనుకుంటే మనకు స్వాతంత్ర్యం రాక పోయేదేమో ?మన అభివుద్ది గురించి ఆంధ్రులు మనకు చెప్పాలా ఇకాడ అభివృద్ధి ఆగి పోయేది రాష్ట్రానిది కాదు వారి అభివృద్ధి ఆగి పోద్ది అందుకే అంటున్నారు వద్దని.
తెలంగాణా వస్తే కొంచెం అయినా మన భాధలు తీరతాయనుకుంటే సీమాంధ్ర పాలకుల భాధ మరోలా ఉంది .తెలంగాణా విడి పోతే రాష్ట్ర రూపు rekha అందంగా ఉండవని, ఇప్పుడున్న పేరు మార్చి "తెలంగాణా" గ మార్చు కోమని అంటున్నారు.మంకు కావాల్సింది అది కాకున్నా ఒక వేల అదే అనుకుంటే ఈ మాటకు ఎంత మంది సీమాంధ్ర పాలకులు ,ప్రజలు సరే అంటారు ? మన భాష వారి మనసులని గాయ పరుస్తుందంటే మన మాట వారి గుండెల్ని చేరుతుందనే కదా. మరి వారి మాట మనుసుని కాదు కదా చెవిని చేరినా సీసం పోసినట్టు ఉంటుంది .

అందరు తెలుగు వారు కలిసి ఉండాలని ఉంటె మరి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు తెలుగు వారు మనతో కలవకుండా ఉన్నారు?తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రం లో ఉండాలని ఏదైనా నియమం ,నిభందన ఉందా? రాజ్యాంగం లో రాసి ఉందా ? అల తెలుగు మాట్లాడే వారంతా ఒక రాష్ట్రంగా ఉండేది నియమైతే హిందీ మాట్లాడే వారు ఎందుకు వేరు వేరే రాష్ట్రాల్లో ఉంటున్నారు?

ఉద్యమం ఎలా ఉంటుందో మనం ఎన్నో సార్లు చూపించాం.ఇప్పుడు అదే ఉద్యమం ఉప్పెన అయితే ఎలా ఉంటుందో చూపిద్దాం.ఉసర వెళ్లి లా రంగులు మార్చే రాజకీయ నాయకులూ మన జీవితాలను లిఖించే ఖర్మ మన ప్రజస్వమ్యన ఉంది .తెలంగాణా అంటేనే తెలుగు మాట్లాడేవారు అని అర్థం .అల్లాంటిది మన భాష దగ్గరి నుండి భావాల వరకు మనల్ని ప్రతిఘతిస్తుంటే ఉరికే ఉండాలా? నీరు నుండి నిలువ నీడ చూపే భూమి వరకు కొల్లగోడుతుంటే మిన్నకున్దాల? మనకు తెలిసి సీమంధ్ర పాలకులు కోట్లు గడిస్తే ,మనకు తెలియని స్విస్ బ్యాంకు ఎకౌంటు లో ఎన్ని ఉన్నాయో?
ప్రభుత్వాలు,పాలకులు ఇలా ఉంటె నక్షలిస్మ ,ఉగ్ర వాదం పెరగటం లో తప్పు లేదు.తెలంగాణా కోసం మనం కూడా ఉగ్ర వాదుల్ల ఉద్యమం చేయాలి.మనం చిందించే ఒక్కో రక్తపు బిందువు నుండి తెలంగాణా ఉగ్రవాదిని తాయారు చేయాలి .రక్తం మాసాలు తుంటే తెలంగాణా వాళ్ళది,తేనే పలుకు లు పలుకుతున్న కేంద్రం,సీమధ్ర నేతలకు మనసంటూ ఉందా ?మనుషులేనా వారసాలు?మన ఆవేదన అర్థమయ్యేనా?నడిచేది,నడిపించేది సీమాంధ్ర నేతల్యి నప్పుడు ఇలాంటి ప్రకటనలో ఆశ్చర్యం ఏముంది?

21, డిసెంబర్ 2009, సోమవారం

తెలంగాణా కావాలా?it's the time for decision

తెలంగాణా కావాలా?
---it's the time for decision


ప్రజలారా మీ కు కావాలా సమైఖ్యాంద్ర ? కావాలను కునే వారు చేతులెత్తండి .చేతులేత్తించే వారు ఉన్నంత వరకు చేతులేత్తు తుంటారు గొర్రె జనాలు. ఎవరి ఉద్యమం వారిది ఇష్టం వచ్చినట్లు తిండి అరగక దీక్షలు. ఎవరిదీ న్యాయ పోరాటం అని అర్థం చేసుకునే తెలివి లేదా? తెలుగు మాట్లాడితే తెలుగు వారు అంత ఒకటేనా? మరి తెలంగాణా వారు మాట్లాడేది తెలుగు కాదని మీరే అంటారు కదా మరి ఎందుకీ రభస? కోట్లు కాపాడు కోవడానికి దీక్షలు అవసరమా? కోటీశ్వరులు చేసే ఈ దీక్ష నిజమైనా దేనా? దొంగ లా దొంగ బుద్ది చూపించి పారిపోయే వారు చేసేది నిజమైనా ఉద్యమమా?
సమైఖ్య "ఆంధ్ర" ఉద్యమం చేసేది వివక్షతోనే చేస్తున్నారు .అదేదో తెలుగు వాళ్ళ సమైఖ్యత ఉద్యమ అని పెట్టుకోవాచు కదా.ఇక్కడ కూడా ఆంధ్ర తెలివి తేటలు చూపించారు. అయినా మీ అందురులు ఇంకా సమైఖ్యంగానే ఉన్నారు కదా ? సీమంధ్ర కావాలని చేయండి పోరాటం. తెలంగానని వదిలేయండి. మొదలు పెట్టిన ఉద్యమాలు "జై ఆంధ్ర ", గ్రేటర్ రాయల సీమ అని .కాని ఇప్పుడు జరుగుతుంది సమైఖ్య "ఆంధ్ర" అని అంటున్నారు ఆంధ్రులు దీనికి తెలివి తక్కువ గ సీమ వాళ్ళు వంత పాడుతున్నారు .తెలంగాణా ఏర్పడితే ఆంధ్రులతో కలిసి ఉండమన్న సీమ వారు ఇప్పుడు ఆంధ్ర పాలకులు చేసే కుటిల రాజనీతికి దాసోహం అయ్యారు . ఒక్క సారి ఆంధ్ర వాళ్ళని అడిగి చుడండి ,తెలంగాణా ఏర్పడితే మీ తో కలిసి ఉంటామంటే ఆంధ్రులు ఏమంటారో చూడండి.ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండదు .

ఇంకెన్నాళ్ళు అమాయకుల చేసి బొజ్జ నిమ్పుకుంటారో మరి ఈ ఆంధ్రా పాలకులు.సంపాదించి బొంద మీద వేసుకొని పోతారేమో ? ఈ ఆంధ్ర పాలకులు . మాట మార్చే ఉసర వెళ్లి రాజ కీయ కుతంత్రాలకు గొర్రెల్లా మారిన ప్రజలను చూస్తే జాలి వేస్తుంది.తెలంగాణా ఉద్యమం ఈ నాటిది కాదని తెలిసి , చిన్న పిల్లాడి మనస్తత్వం లా నాకు చందమామ కావాలని అన్నట్టు .మేము ఇంకా తెలంగాణా వారితో కలిసే ఉంటామని, వారినుండి దోచుకుంది ఇంకా చాల లేదని సమైఖ్య "ఆంధ్ర" ఉద్యమం తేరా పైకి తెచ్చారు .ఇంకెన్నాళ్ళు తయారు గ ఉన్న సంపదని కొల్ల గొడతారు? మీకంటూ సదుపాయాలూ వద్ద? ఈ రోజు సద్దు మనిగినట్లనిపించినా మల్లి ఎప్పటికైనా ఈ ఉద్యమం ఆ గడు. మీ వైద్యం కోసం ఇంకా తెలంగాణా ఆసుపత్రుల మీద ఆధార పడుతున్నారంటే మీకే సిగ్గు చేటు.
ఈ ఉద్యమం లోను సీమ వారు అనే మాట ఇంతకు ముందు అన్నదే .తెలంగాణా కంటే సీమ వారు వెనుక పది ఉన్నారని .అయినా సమైఖ్య"ఆంధ్ర" కావాలని .వారు ఒక విషయం ఎందుకు అర్థం చేసుకోరు ? ఇన్నాళ్ళు ఉన్నది సమైఖ్యంగానే కదా అయినా వెనకపడే ఉంది కదా?ఇంకా సమైఖ్య వాదమే కావాలని కోరు కుంటు న్నారంటే వారికి అభివృద్ధి అవసరం లేదా?
తెలంగాణా ఇప్పుడు రాష్ట్రంగా మారితే వచ్చే నష్టం ఏమిటి ? ఆంధ్ర ,సీమ వారు ఎందుకు అంత దిగిలు చెందుతున్నారు? ఒక వేల కష్ట ,నష్టాలు వచ్చినా ఇన్నాళ్ళు పడిన కష్టం కంటే అది ఎక్కువేమి కాదు.ఇప్పుడు పడే కష్టమేదో అప్పుడు పడతం .తెలంగాణా ని ప్రపంచం చెప్పుకో స్థాయిలో అభివృద్ధి చేస్తాం .సామాజిక తెలంగాణా కావాలి, బంగారు తెలంగాణా కావాలి అని చిలుక పలుకులు పలికే నాయకులు అది వచ్చే సమయానికి ఎందుకు అడ్డు తగులుతున్నారో?
జగ మెరిగిన సత్య మేమంటే ఆంధ్ర పాలకులు బాగా గడించారనేది .అది ఎలా సంపాదించారో కూడా అందరికి తెలుసు .ఇప్పుడు ఆంధ్ర పాలకుల వదనాళ్ళ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ని అభివృద్ధి మేమే చేసాం అని. ఆ అభివృద్ధి హైదరాబాద్ ని కాదు వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి అని తెలుసుకోలేమా? ఒక వేల హైదరాబాద్ ని అభివృద్ధి చేసుంటే కోటీశ్వరులు అయింది ఎవరు? ఒక వేల అభివృద్ధి చేస్తే ,అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ ఒక్కటే ఉందా? ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా ప్రదేశాలు లేవా? విషపు నీళ్ళు తాగుతూ, హైదరాబాద్ కి మంచినీరి,గుంటూరు కి సేద్యపు నీరు అందిస్తేనే కదా అభివృద్ధి చెందింది? ఒకరి కి ఘోరి కడుతూ ఇంకొకరు డబ్బు సంపాదిస్తే అది అభివ్రుద్దియ?
సంవత్సరానికి మూడు పంటలు మా నీటి తో పండించి మాకే ఎగ నామమ? కరెంటు కష్టాలు,కన్నీటి వ్యధలు ఇక్కడ ,చేపల పులుసులు ,పూత రేకులు అక్కడ .రాజధాని కాబట్టి హైదరాబాద్ ని అభివృద్ధి చేశామంటే పది జిల్లాల తెలంగాణా రాబడి ఎక్కడికి వెళ్తుంది? ఎవరు దోచేస్తున్నారు? హైదరాబాద్ ని అభివృద్ధి చేసామని మీరు భావిస్తే ఇంకా ఇక్కడ మురికి వాదాలు ఎందుకు మిగిలి ఉన్నాయి? దుర్గందపు ముసి నది ఎందుకు ప్రవహిస్తుంది ?

ఆంధ్ర,సీమ ప్రజలకు విన్నవించేది ఒక్కటే ,తెలంగాణా వస్తే మీకు వచ్చే నష్టమేమి లేదు .మిమ్మల్ని ఎవరు ఏమి అనరు .ఆదరణలో అమ్మ ప్రేమ కన్నా గొప్పది తెలంగాణా అది మీకు తెలుసు.అక్కున చేర్చుకుని అన్నం పెడితే ,మా నోట్లో దుమ్ము పోసే ప్రయతనం మానుకోండి.

18, డిసెంబర్ 2009, శుక్రవారం

న్యాయంగా పోరాటం చేస్తే నారాయణు డవుతాడు

న్యాయంగా పోరాటం చేస్తే నారాయణు డవుతాడు
నక్క జిత్తుల పోరాటం చేస్తే నారడుదవుతాడు
నారాయణుడు దేవుడు అయితే
నారదుడు అగ్గి పుల్ల స్వామి అయినాడు
తెలంగాణా ప్రజల ఉద్యమం దేవుడు మెచ్చింది
ఆంధ్రుల ఉద్యమం రాక్షసానందం కోసం చేసేది
బ్రతుకు తెరువు కోసం పోరాటం లో ప్రాణాలు కోల్పోతే
శవ రాజకేయం చేసి పొట్ట నింపుకుంటున్నారు
కన్నీరు రాల్చినా దాన్ని పన్నీరు గ మార్చుకుంటున్నారు
దారిద్ర్యం ఇక్కడ రాజ్యమేలితే ధనం తో అక్కడ వర్ధిల్లు తున్నారు
నీరు లేక భూమి నీరసించి పోతుంటే
నిత్యం పంటలతో నిలువెత్తు సంపదను పోగేసుకుంటున్నారు
ఇది మా ఏడుపని మీరను కుంటున్నారు
అది మా కడుపు కొట్టి నింపు కుంటున్నారని మేమంటాము.

పోరు చేస్తుంటే పొట్ట కూటి కోసం

బ్రతుకు భార మైంది ఆంధ్రుల రాజ్యాన
బలుసాకు కరువైంది వీరు చేసే మోసాన
భయంగా ఉంది భూమి పోతుందేమోనని
నీరు దక్కకుండా నిలువు దోపిడీ చేస్తారేమోనని
నీడ మిగల కుండా నిలువుగా ముంచేశారు
కడుపు మీద కొట్టి కన్నీరు మిగిల్చారు
పోరు చేస్తుంటే పొట్ట కూటి కోసం
పోనీ అని వదలకుండా ఇంకా పెత్తనం చేద్దామని చూస్తున్నారు

16, డిసెంబర్ 2009, బుధవారం

ముద్దుకి ముహూర్తం అవసరమైతే

ముద్దుకి ముహూర్తం అవసరమైతే
మురిపెం కలిగిన ప్రతీసారి ముహూర్తం చూడాలి
కళ్యాణ ముహూర్తం కలిసివస్తే ఆగదు
కలిసి ఉంచే కళ్యాణ ముహూర్తం మన చేతిలో లేదు
పంచ ప్రాణాలకు ఆరో ప్రాణంగా నిను ఆహ్వానించినా
ప్రాణాలు తోడేసే మాటలతోనే ముహూర్త కాలం దాటి పోతుంది
వయసు వచ్చి వంటరితనాన్ని వద్దంటుంటే
ఈ వయసులో వలపే మనసుకు తోడంటావు

ఆగమాకు హృదయమా అంతు చూడు ప్రేమది

ఆగమాకు హృదయమా అంతు చూడు ప్రేమది
అడిగేవారు ఎవరు లేరు అంతు నీకు లేదా అని
అలుసు ఎవ్వరికి కాకుండా మూగ వాన్ని చేయి మనిషిని
ఆత్మ వంచన చేసుకోకుండా ధైర్య మివ్వు ప్రతి ఒక్కరికి
అంతు లేని ప్రేమ తో నింపి వేయి మనసుని
అందరికి నిరూపించు శ్వాస రూపం లో నిండి ఉంది నీవని

13, డిసెంబర్ 2009, ఆదివారం

దోచుకున్న ది చాల లేదా ఇంకా కావాలా

జననీ జనయిత్రి
తెలంగాణా నా ధరియిత్రి
జయిస్తానుస్వరష్ట్రాన్ని
జీవితాన్ని ధార పోసి
జలం దోచు కున్నారు
జనాన్ని దోచుకున్నారు
మా పొట్ట కొట్టి
మీ పొట్ట నింపుకున్నారు
ఉద్యమాలు మావి
ప్రతిఫలాలు మీవి
మీరు లేకుండా బ్రతక లేమనా?
మా బ్రతుకుల మీకు అంకితం చేయాలన
ఎందుకురా ఆంధ్ర వాళ మా మీద నీ దొంగ ప్రేమ
దోచుకున్న ది చాల లేదా ఇంకా కావాలా?

11, డిసెంబర్ 2009, శుక్రవారం

ఇక చాలు మీ ప్రేమ

ఇక చాలు మీ ప్రేమ
-'ఆంధ్ర' Resigned it's a new game again

తెలంగాణా తీర్మాన్నాని అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలని ప్రకటించక జరిగిన పరిణామాలు చాల నాటకీయంగా ఉన్నాయి. కొంచెం ప్రేరణగా ఉన్నాయి . తెలంగాణా కోసం అమర వీరులైన విద్యార్థులు ,ప్రజలు చేసిన త్యాగాలు వృథా అవుతాయేమో నని భయంగా ఉంది .అర్థం కాని విషయం ఏమి టంటే వీళ్ళు రాజీనామాలు ఎందుకు చేసారని ? ఇక్కడ ఉద్యమం 50 ఏళ్ల నుండి కొనసాగుతుంది .ఎంతో మంది తెలంగాణ కోసం బలి అయినారు .కాని క్రొత్తగా మాకు ప్రత్యేక ప్రత్యేక ఆంధ్ర ,గ్రేటర్ రాయల సీమ కావలంతం హాస్యాస్పదం.

రాజీనామాల విషయం లో ఆంధ్ర ,సీమ నాయకులను మెచ్చు కోవచ్చు .ఎందుకంటే మన రాజకీయ నాయకులూ చేయని పని చేసారు .కాని ఇది వారు మన ఉద్యమాన్ని నీరు కార్చడానికే అని అందరికి తెలుసు .మేము ఆంధ్ర వాళ్ల మోచేతి నీళ్లు తాగాలా? అని సీమ వారు అంటారు. తెలంగాణా వారేమో ఆంధ్ర వాళ్లు మాకు అన్యాయం చేస్తూ న్నారు అంటారు . మొత్తానికి ఆంధ్ర వారే బాగు పడ్డారని కదా దీని అర్థం. లేక ఆంధ్ర వాళ్ళకి మందిని ముంచే తెలివి బాగా ఉందనా అర్థం ?

మేము వెనుక పడ్డం అని సీమ వారు అంటారు ,మేము వెనుక పడ్డం అని తెలంగాణా వారు అంటారు మొత్తానికి ఆంధ్ర నే అభి వృద్ది అయిందని కదా దీని అర్థం. మరి ఇంకెందుకు వారి నాటకాల రాజీనామాలు ? హైదరా బాద్ ని అభివృద్ధి చేసాం అని అంటున్నారు ఆంధ్ర వాళ్లు . హైదరాబాద్ ని ఎంత అభివృద్ధి చేసారో ఇక్కడి సంస్కృతి అంతకన్నా ఎక్కువగా దిగ జార్చారు చెత్త సినిమాలు తీసి. హైదరాబాద్ అభివృద్ధి ఎవరి పొట్ట కొట్టి చేసారు? ఎవరి రక్తాన్ని స్వేదంగా మార్చి చేసారు ? 400 ఏళ్ల నుండి హైదరాబాద్ తెలంగాణా లో అంతర్భాగం. హైదరాబాద్ పై పూర్తి హక్కులు తెలంగాణా వారివే .తెలంగాణా ప్రజలు ఎవరిని ,ఎక్కడికి వెళ్ళమని అనలేదు కదా ఉంటే ఉండండి. కాని మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం కోసం 50 ఏళ్ల నుండి పోరాడుతుంటే ఇప్పుడు మీరు చేసే కుట్రలను సహించేది లేదు ఇప్పటికే చాల కుట్రలు చేసారు . మా ఉద్యమం కడుపు మాడి చేస్తుంటే మీరు తిన్నది చాలక ఇంకా తినాలని చేస్తున్నారు

2004 లో పోతు ఏమని పెట్టుకున్నారు ?ఎందుకు పెట్టుకున్నారు? ప్రత్యేక రాష్ట్రం ఇస్త మనే కదా ? UPA common minimum programme లో ఎందుకు తెలంగాణా చేర్చారు? అప్పుడు చేయని రాజీనామాలు ఇప్పుడెందుకు చేస్తున్నారు ? అప్పుడు ఎక్కడైనా పడుకున్నారా ? ఆంధ్రులకు ,సీమ వాసులకు ముందు ఒక నిర్ణీత అభిప్రాయం లేదు .కొంత మంది సమైఖ్యాంధ్ర అంటారు కొంత మంది జై ఆంధ్ర అంటారు ఇంకొందరు గ్రేటర్ రాయలసీమ అంటారు నిర్ణీత అభిప్రాయం లేని మీరా మా ఉద్యమాన్ని తప్పు పట్టేది ? లగడ పాటి ,J.C. ,జగన్ వీరికి M.P. ఉండాల్సిన అవసరం ఏముంది? కోట్లకు పడగలేత్తినారు .పొత్తు పెట్టుకున్నప్పుడు లేని ఆందోళనలు ,ఆత్మ హత్యలు ఇప్పుడు ఎందుకు ? ఆంధ్ర ,సీమ ప్రజలు TRS తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు MLA,MP లను నిల దీయ లేదు ?

kcr నిరాహార దీక్ష చేయ బయలు దేరినపుడు పోలీస్ అరెస్టు చేసి నానా రగడ చేసారు కాని ఇప్పుడు ఎందుకు చేయరు? ఇక్కడ రాళ్ళు రువ్వితేనే ఉద్యమం లోకి సంఘ విద్రోహ శక్తులు వచాయి అన్నారు .మరి ఇప్పుడు వారు ప్రొక్లెఇనర్ తో బస్ స్టాప్ పద గొట్టి ,బాంబ్ వేష్టం అంటున్నారు ఎవరిదీ విద్రోహ చర్య? ఇక్కడ విద్యార్హ్తులు మౌన ప్రదర్శన చేసినా కుక్కలా కొట్టి నారు మరి అక్కడ అన్ని బస్ తగల బెట్టినా మిన్న కున్నారు (అలా కొట్టాలని కోరిక కాదు)ఇదంత తెలంగాణా ఉద్యమానికి జరుగుతున్న కుట్ర అని తెలిసి పోతుంది
తెలంగాణాని వదిలి ఆంధ్ర ,సీమ వారు ఉండ లేక పోతున్నారు ఎందుకో కపట ప్రేమ. తెలంగాణా వస్తే ఎవరిని వదిలి వెల్లమన్నాము ? ఎవరిని చంపుతా మన్నాము ? వారి భయమల్లా ఇప్పుడున్న స్వేచ్చ హరి యిస్తుందని .తెలంగాణా వారిని ఇంతకు ముందు లా వారిని దోచుకోలేమని బెంగ .తెలంగాణా ప్రజలకు ఆంధ్ర ,సీమ వారిలాగా రెండో ఆలోచనే లేదు మాకు కావాల్సింది తెలంగాణా స్వతంత్రం అది ఒక్కటే అజెండా .నక్సల్స్ ఉద్యమం మొదలైనదే ఆంధ్ర పాలకుల దురాగతాలను ఎదిరించడానికి .వారి అన్యాయ పాలన నుండి విముక్తి ప్రసాదించాలని .
తెలంగాణా ఏర్పాటు ప్రక్రియలో తొలి అడుగు సరిగా పడనే లేదు ముళ్ళ కంపాలా కాలికి అడ్డం వస్తున్నారు ఆంధ్ర ,సీమ పాలకులు నయవంచకులు స్పూర్తిని చంపు కోకుండా తెలంగాణలో కొత్త సూర్యుని ఉదయింప చేయాలి .

జై తెలంగాణా

10, డిసెంబర్ 2009, గురువారం

తొలగింది అర్ధరాత్రి

బ్రిటిష్ దొరల పాలన
ఆంధ్రుల దొరల పాలన
తొలగింది అర్ధరాత్రి
ఆ నాటి భారత దేశ పరిస్థితి
నేటి తెలంగాణా పరిస్థితి
ఆంధ్రులు చేసింది అభివృ ద్దియో
దోపిదియో తెలంగాణా అంటే వారికెందుకు భయం
నేటి భారత దేశం
రేపటి తెలంగాణా
కలిసి సాగి కస్తలను కదా తెర్చుదాం
అభివృద్ధి సుస్థిరం చేస్తాం
ఆనందాలను నింపేస్తం

తెప్పించరా తెలంగాణా

తెప్పించరా తెలంగాణా
తెలివిగా జీవించేందుకు
తెల్లవారే రేపటి ఉషోదయం
నీ పిల్లలకు న్యాయం చేయాలి
దోచుకు పోతున్న నీటిని
దోసిలి తో పట్టి దప్పిక తీర్చు
అర చేతిలో సూర్యుని ఆపలేమని తెలిసి
ఆంధ్రులు / అందరు తెలివి తక్కువుగా ప్రవర్తిస్తున్నారు
నీ పిడికిలి బిగియిస్తే నీ కందరు దాసోహం
నీ వొక్కడివీ కాదు నీ కోసం నలుగురు
నీ తెలంగాణా కు పదుగురు
కలిసి సాగరా ముందుకు
కస్తాలను కడ తేర్చర మనకు
జై తెలంగాణా జై తెలంగాణా

ఎన్నడూ రాదా ఇక స్వాతంత్ర్యం

ఎవ్వరిది ఈ ఉద్యమం?
ఎప్పటిదీ ఉద్యమం?
ఎందుకీ ఉద్యమం?
మా కూడు మాకు దక్కాలని
మా నీరు మాకు దక్కాలని
మమ్ముల మేము పోషించుకోవాలని
మా పొట్ట కొట్టే వారిని వెలి వేయాలని
వాడెవ్వడు వాడెవ్వడు
మా అన్నం మెతుకు పై పేరు రాసేందుకు
వాడెవ్వడు వాడెవ్వడు
మా గొంతు నిండే దుకు
మో చేతి నీళ్లు తపెందుకు వాడెవ్వడు
ఎన్నడూ రాదా ఇక స్వాతంత్ర్యం
ఎంకేన్నల్లీ తెలంగాణా స్వాతంత్ర్య సమరం

2, డిసెంబర్ 2009, బుధవారం

ఎందుకిలా చేశావు

ఎందుకిలా చేశావు
ఎదను వదిలి ఎందుకు వెళ్ళావు
ఇన్నేళ్ళ మన అనుభందాన్ని
ఇలా దూరం చేసావు
పరిమళించిన మనసుకు
పాడి ఎందుకు కట్టావు
మనసు లోని మందిరం వదిలి
మాసి పోయిన మంటపాన్ని మిగిల్చినావు
ప్రేమను జయించి పెళ్లి చేసుకున్దామను కుంటే
ఓడించి ఒంటరి తనాన్ని మిగిల్చినావు

30, నవంబర్ 2009, సోమవారం

జై తెలంగాణా (ఇది కవిత కాదు )

జై తెలంగాణా
-Another freedom fight in "ANDHRA" prdesh
ఉద్యమం అనేది ఎప్పుడు వచ్చిన అది జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికే ఇది జగ మెరిగిన సత్యం. ఇప్పటికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి అందులో తెలగాణ కోసం జరుగుతున్న ఉద్యమం ఈ నాటిది కాదు. స్వాతంత్ర్యం కోసం భారత దేశం సాగించిన ఉద్యమం ఇంకా 'ఆంధ్ర' ప్రదేశ్ లో సాగుతూనే ఉంది. బ్రిటిష్ పాలనలో కూడా అన్యాయానికి గురికాని తెలంగాణా ప్రజలు బ్రిటిష్ వాళ్లు కూడా పరిపాలించని ,పరిపాలించే అవకాశం రాని చోట ఆంధ్ర వాళ్లు తెలంగాణాని పరిపాలిస్తూ తెలంగాణా ప్రజలను అన్యాయానికి గురిచేస్తున్నారు.
తెలంగాణా ఉద్యమం ఉధృతమైన ప్పుడల్లా ఆంధ్ర ప్రజలనుండి వచెది ఒకే ఒక మాట " తెలుగు వారంతా ఒక్కటే అని" ఆంధ్ర వాళ్లు తెలగాణ లో పెట్టు బడులు పెట్టారని. ఆ మాటకి వస్తే భారత దేశమంతా ఒక్కటే ,ప్రపంచమంతా ఒక్కటే ఎవరైనా ఎక్కడైనా ఉండవచు ,పెట్టు బడులు పెట్ట వచ్చు. కాని అన్యాయమైన విషయమేమిటంటే ఎవడో తెలియని వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీ మీద అజమాయిషీ చేస్తే ఎలా ఉంటుందో ,ఇప్పుడు తెలంగాణలో జరుగుతుందీ అదే.
తెలంగాణా కోసం ఉద్యమించే నాయకులని తప్పు పడుతున్నారు ఏమంటే "తెలుగు ప్రజలంతా ఒక్కటే అని "
తెలంగాణా కోసం ఉద్యమించే ఉద్యమం పద్దతి కాదు అని అనుకుంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ఉద్యమాన్ని ,పొట్టి శ్రీ రాములు చేసిన ఉద్యమాన్ని కూడా తప్పు పట్టాల్సి వస్తుంది. ఎలా అంటే ఆంధ్ర ప్రజల మాటల ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఉండవచు ,పెట్టు బడులు పెట్ట వచ్చు కదా ఆ విధంగానే బ్రిటిష్ వాళ్లు వచ్చారు పెట్టు బడులు పెట్టారు .వాళ్ళని వెలి వేయడం లో లేని తప్పు తెలంగాణా కోసం చేస్తే తప్పేంటి ?బ్రిటిష్ వాళ్లు కూడా ఇక్కడ పెట్టు బడులు పెట్టారు ప్రాజెక్ట్స్ కట్టించారు .అదే సమయాన మన దేశాన్ని కొల్ల గొట్టారు ఇప్పుడు ఆంద్ర ప్రజలు చేస్తుంది కూడా అదే .
ప్రజలంతా ఒక్కటే అయితే పొట్టి శ్రీ రాములు తెలుగు వారి కోసం ఎందుకు ఉద్యమిన్చాల్సి వచ్చింది? పరిపాలన సౌలభ్యం ,భాష ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీ రాములు తప్ప ఇంకెవరు ఉద్యమిన్చాలేదే? తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం ఈ నాటిది కాదు .చారిత్రాత్మకంగా జరుగుతుంది. బ్రిటిష్ వాళ్లు పరిపాలిస్తున్నప్పుడు తెలంగాణా ప్రాంతాన్ని వారు ఆధీనం చేసుకోలేదు .నిజాం ప్రభువు పరి పాలించాడు .దేశానికి స్వాతంత్ర్యం ౧౯౪౭ (1947) ఆగష్టు ౧౫ (15) న వస్తే తెలంగాణా కి ౧౯౪౮ (1948) సెప్టెంబర్ ౧౭ (17) న వచ్చింది .(నిజంగా అయితే ఇప్పటికీ తెలంగాణా కి స్వాతంత్ర్యం రాలేదు) అది కూడా భారత ప్రభుత్వం సైనికులతో బలవంతంగా చేసిన పని వలన .౧౯౫౬ (1956) లో "ఆంధ్ర" ప్రదేశ్ ఏర్పడింది .పెద్ద అమ్నుషుల ఒప్పందం ప్రకారం ఇది జరిగింది .పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం (gentle men's agreement) ఆంధ్ర- తెలంగాణా రాష్ట్రం గ ఉండాల్సింది "ఆంధ్ర " ప్రదేశ్ మారింది. ఇలా జరగ దానికి ముఖ్య కారణం "ఆంధ్ర" ప్రాంత కాంగ్రెస్ నాయకులు .1947 తర్వాత కాంగ్రెస్ ఎక్కువగా ఆంధ్ర ప్రాంతాన జరిగింది కారణం ఇక్కడి నిజాం పభువు తెలంగాణాలో కాంగ్రెస్ ని అభివృద్ధి చెంద నీ య లేదు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముఖ్య మంత్రుల ఎంపిక ఒక సారి ఒక ముఖ్య మంత్రి ఆంధ్ర నుండి ఉంటే ఉప ముఖ్య మంత్రి తెలంగాణా నుండి ఉండాలి .మరియొక సారి ఒక ముఖ్య మంత్రి తెలంగాణా నుండి ఉంటే ఉప ముఖ్య మంత్రి ఆంధ్ర నుండి ఉండాలి .కాని ఇలా జరగట్లేదు జరగలేదు .మొదటి ముఖ్య మంత్రి ఆంధ్ర నుండి ఉన్నాడు కాని తెలంగాణా కి ఉప ముఖ్య మంత్రి పదవి ఇవ్వలేదు . అప్పటి నుండే తెలంగాణా కి అన్యాయం జరుగుతుంది ఇంకా జరుగుతూనే ఉంది .
అప్పటి నుండి నుండి వస్తున్న ప్రతి ప్రభుత్వం ఆశ చూపి పబ్బం గడుపుతునే ఉంది. ౧౯౬౯ (1969) లో మల్లె మర్రి చెన్న రెడ్డి ఉద్యమం మొదలెట్టాక ఇప్పటికి సరైనా న్యాయం జరగట్లేదు .ఆ నాడు జవహర్లాల్ నెహ్రు నోట "అమాయకు లైనా తెలంగాణా ని ఆంద్ర వాళ్ళతో కలిపెస్తున్నం .ఎప్పుడు నచాకున్న విదిపోవాచు అని". ఆ రోజు నెహ్రు ఆంద్ర వాళ్ల కుటిల తెలివి గ్రహించి అన్నాడేమో ఏమో కాని నిజమే అన్నాడు.
కే చ ర ఉద్యమం ఉద్యమం మొదలెట్టాక సంతోషించాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే UPA common minimum programme లో తెలంగాణా అంశానికి ప్రాముఖ్యత ఇవ్వడం .దానికి ap congress support చేయడం కాని రాష్ట్ర ముఖ్య మంత్రి రాజ శేఖర రెడ్డి మోసం చేసి "తెలంగాణా వస్తే తెలంగాణా లో విదేశీ యుల్ల బ్రతాల్సి వాస్తుని అనడం "ఎంత కుటిల రాజకీయమో అర్థం చేసు కోవచు. ఆ తర్వాత పార్టీ లైన తెలుగు దేశం, భాజపా తెలంగాణా ఆవశ్యకతను గుర్తించి తెలంగాణా కోసం సహక రించి నట్టే సహక రించి వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి మంచికి దారి తీసి "తెలంగాణా కి స్వాతంత్ర్యం వస్తే ఎంతో బాగుంటుంది".



29, నవంబర్ 2009, ఆదివారం

ఆది భిక్షువే అడిగి ఉంటే ప్రేమను

ఆది భిక్షువే అడిగి ఉంటే ప్రేమను భిక్షగా
ఆది శక్తి ఇచ్చేదా ప్రేమను వరంగా?
అపర్ణ పరాశక్తి చేస్తేనే కదా కఠోర దీక్ష
ప్రసాదించాడు వరాన్ని అర్థ నారీశ్వరుడుగా
ఎన్నటిదో ఆ వరం ప్రేమని చేసాడు ప్రేయసికి ఆధీనం

గుప్పెడంత గుండె

గుప్పెడంత గుండెకి ప్రేమ ఓ ఉప్పెన
గూడు చెదర గొట్టి కన్నీటిని మిగులుస్తుంది
గుండెల్లో నింపుకున్న ప్రేమ ప్రాణంగా ఉంటే
ప్రేమించే ప్రేయసి ఆయువును నింపుతుంది
ప్రేమ పిచి వాన్ని చేసే ప్రేయసి ఉంటే
ఆ ప్రేమే ప్రియుడి ప్రాణాలు తీస్తుంది

సారధ్యం

సారధ్యపు ప్రగతికి సాధన కావాలి
సాధించే మనసున్న స్వాగతించే హృదయం కావాలి
సాహసించి చేరుకున్నా సమస్యలను అధిగమించాలి
సమస్యను ఎదుర్కొన్నా పరిష్కారం న్యాయంగా ఉండాలి
సారూప్యత లేకుండా అందరినీ సంతోష పెట్టాలి .

26, అక్టోబర్ 2009, సోమవారం

కలి కాలపు ప్రేయసి

ప్రేమను ప్రేమించినంతగా
విరహాన్ని ప్రేమించగలగాలి
నేటి కలి కాల ప్రేమికుడు
ఎవరికీ తెలుసు ఎప్పుడు ఎలా మారెనో ప్రేయసి మనసు
ఎన్ని తిప్పలు పెట్టి ఎంత దూరం చేసుకుంటుందో
దేవుడు చేసిన పని అని నీ దేవత్ నీకు దూరమైతే
తట్టుకో గలగాలి కదా ప్రేమికుడు

15, అక్టోబర్ 2009, గురువారం

ఆవేదన

పగిలిపోయిన హృదయానికి ఔషధం ఉందా?
పగల గొట్టిన దేవునికి హృదయం అంటు ఉందా?
జీవితానికి ఆశ అని నిను చూపి
జీవితానికి అడియాషగా నిన్ను దూరం చేశాడు
గోపాల బాలునిగా గోపికలకే కృష్ణుడు
ఏక పత్ని వ్రతుడిగా సీతకే రాముడు
ప్రేమను పంచడానికే రూపాలు మార్చిన గోవిందుడు
నా ప్రేమ గెలవకుండా, మరొకరి ప్రేమను పొందకుండా ఒంటరిని చేశాడు
ఆవేదన అర్థమైతే ఆలోచించక వరమివ్వు
ఆనందం నాకు సొంతం చేసే నా ప్రేమను నాకు దక్కనివ్వు.

కదలదే కాలం

అవును అనడానికి ఆనందం ఎక్కడుంది
కాదు అనడానికి కారణాలేమి ఉన్నాయి
కలిసి ఉందామనుకున్నది ఒక కల
విడి పోయామన్నది కల కాకుడని ఒక నిజం
దేవుడు నా దేవతను దూరం చేసాడని నిందించనా
దేవుని రూపం లో ఇదంతా చేసిన మనిషిని దూశించనా
మంచి చేసింది మనిషికా ,మనసుకా ఈ కాలం
కాకా వికలం చేసి కదలదే మంచి కోసం ఈ కాలం

2, అక్టోబర్ 2009, శుక్రవారం

గాంధీజీ సాధించిన స్వరాజ్యం
గాయాల పాలయ్యింది ప్రజల రాజ్యం
గుండాల పాలనలో బంది అయ్యి
గుండెల్లో గునపాలు దింపుతుంది
నీవు చూపిన అహింసా దారి కానరాక
హింస దారిలో రగులుతోంది టెర్రరిజం
నిషేదించిన మద్య పాణం
నీరులా ఏరులై పారుతుంది
నీవు సాధించిన స్వతంత్రం
నిన్ను గుర్తు చేసుకోలేనంతగా మాయ మైంది

19, సెప్టెంబర్ 2009, శనివారం

నీవు వస్తావని

అన్ని నీతో కోరుకుని అన్నినీతో కావాలనుకుని
జీవితం నీతో నే అంతం కావాలనుకుని
దేవుణ్ణి దీనంగా వేడుకున్న
దేవుని దీవెన దక్కలేదు.
నా దేవతా నాకు దక్కలేదు
మరుపు రావు మధుర క్షణాలు
మారలేదు నా మనసు
ఇంకా ఏదో ఆశ
వరంగా నీవు వస్తావని

3, ఆగస్టు 2009, సోమవారం

అమ్మాయి జోలికి వెళ్లొద్దు జాగర్త

అందరికి విన్నపం.అమ్మాయిల జోలికి వెళ్ళకండి జీవితాన్ని పాడు చేసుకోకండి . మధ్య జరిగిన సంఘటనలు ఒక సారి చూసినట్లయితే అమ్మాయిల గొంతు కోయడము ,ఆమ్లముతో దాడి చేయడము ,కత్తి తో పొడవడము జరుగుతున్నాయి .ప్రతి సారి అబ్బాయే నేరస్తుడుగా శిక్షించ బడుతున్నాడు.అదే సమయాన అమ్మాయి అబ్బాయి చేతిలో శిక్షించ బడుతుంది.
ప్రస్తు సమాజం అమ్మాయి వైపే ఉంది .కొన్ని ఉదాహరణ గా ,(నిజాలను) తీసుకుంటే ఒక అబ్బాయి, అమ్మాయికి ప్రేమ ను తెలియ పరచాడు అమ్మాయికి ఇష్టం ఉంటే గొడవ లేదు .ఇష్టం లేదనుకో అప్పుడే ప్రాబ్లం.మనం ఎంత చేసినా సమాజం దృష్టి లో అమ్మాయి వెంట పడడం. విషయం అమ్మాయి నీ పై కేసు పెట్టొచ్చు .కాని అదే అమ్మాయి ,అబ్బాయికి ప్రేమను తెలియ పరిచిన్దనుకోండి అబ్బాయికి ఇష్టం లేకున్నా మన వెంట పడితే మనం కేసు పెట్టె సౌలభ్యం లేదు.అమ్మాయి ప్రేమ ఒప్పుకోలేదని చని పోయే అబ్బాయిలే ఎక్కువ కాని ,అబ్బాయి ప్రేమ ఒప్పుకోలేదని చని పోయే అమ్మాయిలు .% .ఉన్నా చాల తక్కువ .ఒక వేళ అమ్మాయి ప్రేమను అబ్బాయి ఒప్పుకోలేదని అమ్మాయి చని పోయినా అబ్బాయిని ఖైదు చేసే అవకాశమే ఎక్కువ .అదే అమ్మాయి వల్ల అబ్బాయి ప్రాణాలు తీసుకున్నా అమ్మాయికి జరిగే నష్టమేమి లేదు.
ఇక దాడుల విషయం చూస్తే నీ ప్రేమను ఒప్పుకోలేదని,నీకు దక్కట్లేదని దాడి చేస్తున్నారు కాని అలాంటి పరిస్థితి కలిపించినా అమ్మాయలదేమి తప్పు లేదంటారు సమాజంలోని పెద్దలు.అసలు దాడి చేయడం తప్పు నేను కూడా దీని వ్యతిరేకం. కాని అమ్మాయిలు కూడా పరిస్థితి కలిపించకూడదు.
అమ్మాయి చేత నీవు వ్యతిరేకించ బడినా, అమ్మాయి నిన్ను వ్యతిరేకించినా ,నీవు దాడి చేసి గాయ పరచిన (గాయం కొన్ని రోజుల్లో మానుతుంది, కాని నీవు మాత్రం జీవిత ఖైదు గా జైల్లో ఉంటావు).ఎలా అయినా ఎక్కువ నష్టపోయేది అబ్బాయిలే.
అందరు అబ్బాయిలు మోస గాళ్ళు అంటారు కాని అమ్మాయిలే నిజమైనా మోస గత్తేలు .మనం బహిరంగంగా చెప్పుకోలేము వాళ్లు చెప్పుకుంటారు. మనకు శిక్షించడానికే చట్టాలు,న్యాయ స్థానాలు .కాని వారికి శిక్షించడానికి లేవు ఎందుకంటే వాళ్ళని శిక్షించుకుంటూ పోతే భూమిపై ఉన్నా జైళ్ళు ,న్యాయ స్థానాలు సరిపోవు.అందుకే వాలని శిక్షించడానికి యమున్ని అధిపతిగా నియమించారు కాని యముని భార్యను కాదు.
బహిరంగంగా మనం ఒక అమ్మాయిని తదేకంగా చుస్తున్నమంటే దానికి కుడా కేసు పెట్టుకోవచు మనకు సౌలభ్యం లేదు. చూడు చూడు అని వాళ్ళంతా చూపించే బట్టలు వేసుకుంటారు(వేసుకోరు) చూస్తే నేమో కేసు అంటారు. రేప్ రేప్ అని మొత్చు కుంటారు.
ఇంతకీ నేను చెప్పలనుకున్దేమిటంటే కుక్క కాటుకు అయినా మందు ఉంది కాని అమ్మాయి కలవరం జీవితాంతం మానని రాచపుండు మందు ఉండదు.
సో జీవితాలను నాశనం చేసుకోకండి.
ప్రేమను మనము వ్యక్త పరిస్తే అమ్మాయిలు మనలను తమ చుట్టూ తిప్పించు కుంటారు.వాళ్ళకి ఇస్తమున్న సరే,అది వాళ్ల క్రూరత్వానికి నిదర్శనం .అదే అమ్మాయి ప్రేమను వ్యఖ పరిస్తే ఇష్టమా ,లేదా వెంటనీ చెప్పేస్తాం .అమ్మాయిలు తమ వెంట తిప్పించుకొని మన ప్రేమను అంగీకరిస్తారని నమ్మకం కూడా లేదు.ఇంట్లో వాళ్లు తిడతారని, నీకన్న మంచి సంబందమని చెయ్యిస్తారు.
అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని ప్రేమని మర్చి పోడు కాని అమ్మాయి మర్చి పోగలదు. మరుపు మార్పు అమ్మాయిల సహజ గుణం .రాయి నైనా కరిగించి ఒక రూపాన్ని తేగలం కాని అమ్మాయి హృదయాన్ని కరిగించి మన రూపాన్ని ముద్రించలేము .జీవ పరిణామ సిద్ధాంతానికి సరియిన రుజువు అమ్మాయి మనసు.తనకు నచినట్టు మారిపోతుంది ఎవరు ఎలా ,ఎటు పోయినా సరే ఎవరి జీవితం తో వారికి అవసరం ఉండదు.తన వల్ల ఒకరి జీవితం పాడవుతుందని తెలిసీ మనలను ఒంటరిగా చేసి పోతారు.
అమ్మాయిని గాని ,అబ్బాయిని గాని ప్రేమించాలంటే మొదట స్నేహం చేయాలి కాని ఇక్కడ మళ్లీ అబ్బాయే నిదించ బడు తున్నాడు.ఎలా అంటే ప్రేమనిచడానికి స్నేహం (పరిచయం) మొదట కావాల్సిందే ముక్కు మొఖం తెలియని వాళ్ళని అయితే ప్రేమించలేము కదా .అమ్మాయిలు ఈ స్నేహాన్ని ప్రేమగా త్వరగా అంగీకరించరు ప్రేమని వ్యక్త పరిస్తే నేను నీతో స్నేహం మాత్రమే చేశాను ప్రేమించలేదు అంటారు.అదే వారు స్నేహాన్ని ప్రేమగా మార్చు కోవలనుకుంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు అదే ప్రయత్నాలు మనం చేస్తే కనీసం దాన్ని స్నేహంగా కూడా చూడరు .మనతో మాట్లాడారు.అంత వరకు స్నేహితులు అయి ఉండి ,ప్రేమిస్తున్నామని తెలిస్తే వెంటనే విరోదుల్లా చూస్తారు.అది వారి మనసుకున్న వికృత గుణం. స్నేహాన్ని ప్రేమగా అంగీకరించలేని వారు ,ఇంతకు ముందు స్నేహాన్ని కొనసాగించలేరు అమ్మాయిలు. మనం ఎంత ప్రయత్నించినా అర్థం చేసుకోరు. అదే వారు చేస్తే మళ్లీ మనతో స్నేహం కొనసాగించడానికి వెనుకాడరు .

5, జులై 2009, ఆదివారం

నేను నిన్ను ప్రేమించాను
నన్ను మించి నిన్ను ప్రేమించాను
గుడిలో దేవతలా ఆరాదించాను
దారి చూపే ఆత్మీయ నేస్తంలా పూజించాను
నీ తోనే జీవితాంతమని నమ్మాను
కలలో కూడ నాకు దూరం కావద్దని కోరుకున్నాను
కన్నీటిలో కరిగిపోవద్దని గుండెల్లో దాచుకున్నాను
కాని గుండెనే కరిగించి ,కన్నీటిని మిగిల్చి నాకు దూర మయ్యవు.

27, జూన్ 2009, శనివారం

నీ ప్రేమ నాకు ............

నా హృదయం లో నిన్ను దేవతగా ప్రతిష్టించి
నా మనసునుని నైవేద్యంగా అర్పించి
నీ ప్రేమ కోసం నిన్ను పూజిస్తున్నాను
నా పూజకు మెచ్చి ఆ దైవం వరం ఇస్తాడు కాని
నీ ప్రేమ నాకు దక్కకుంది

9, ఏప్రిల్ 2009, గురువారం

వివాహం

రాగాలపల్లకి ఎక్కి
జాణ నాకోసం వచ్చే శుభతరుణం
పాదాలను పన్నిటితో కడిగి
వందేళ్లు నాతో సహజీవనం చేసే తోడు దొరిక్రే ఆనంద సమయం
నింగి నేల ఉన్నంతవరకు ప్రేమనుపంచి
వివాహ బంధం తో జతకట్టే పవిత్ర ముహూర్తం
వారితో ఏడడుగులు వేసి
హంసతునికా తల్పం పై ఊరేగే ఉత్సవ సమయం
మురిపించండి మమ్ము మా పెళ్ళికి మీరాకతో

పెళ్లి ముహూర్తం

పెళ్లి చూపులతో మొదలైన ఈ పరిచయం

పెళ్లిగా మారే శుభ తరుణం

వేద మంత్రాలు మనస్సుని ఆహ్లాద పరిస్తే

వేయి కళ్ళ చూపులు మా కాపురాన్ని ఆహ్లాదంగా మారుస్తాయి.

మంగళ వాయిద్యాలు మాకు రాగాన్ని పంచితే

మంగళకరమైన మీ దీవెనలు మాకు అనురాగపు విలువ తెలుపుతాయి

కలిసి వేసే ఏడడుగులు జీవితానికి తొలి అడుగులైతే

కలిసి వచ్చే మీ అడుగులు కలకాలం మమ్ము కలిపి ఉంచుతాయి

నీ పెళ్లి కి

రాజసం ఉట్టిపడే నడకలో
రాణిలా నాతో నడిచి
రాజ్యమేలేను నా జీవితంతో
రావాలి సైన్యంలా మీ ఆశీర్వాద ఆయుధాలు అందించుటకు

11, ఫిబ్రవరి 2009, బుధవారం

వరం నాకు ప్రసాదించలేదు

చెలిమి అందించిన దేవుడు చెలిని అందించటం లేదు.
చేతిలో చేయివేసి నడిపించి చెయ్యి అందించటం లేదు.
చెప్పగలిగిన మాటలు చేతల్లో చేయ్యనీవటం లేదు.
చెదిరిపోని జ్ఞాపకాలు ఎన్ని ఉన్న చెంత ఉండే తోడు ఇవ్వటం లేదు.
చేయగలిగేది నేనైనా చేయించే నీ వరం నాకు ప్రసాదించలేదు

నీర జాక్షి నీవు నా దానివేనా

నీర జాక్షి నీవు నా దానివేనా ?
నీలో ఉన్నది నీనేనా?
నీకు జీవితం పంచగాలిగేనా?
నిన్ను నా దాన్ని చేసుకో గలనా?
నిన్ను వరియించి నీతో సహజీవనం చేయగలిగేనా?
నాలో ఈఊహలకు అంత మెప్పుడు?
నా ఈ ఆనందాన్ని సొంతం చేసేదెప్పుడు ?

ఎవరు నాకోసం

ఎదలో ఎవ్వరు లేరు నా కోసం
ఎప్పటికి రారు నాకోసం
ఈ పూట ఇరువురం
రేపటికి కావచ్చుఒక్కరం
నమ్మకమే లేదు నా ఆనందం లో
సగ భాగమెవ్వరికో
నాకు ఆశే లేదు నా జీవితం లో
తోడు ఎవ్వరికో
ఎవరు నా కోసం
నాకు నీనేనా నాకంటూ ఒకరున్నారా?

10, ఫిబ్రవరి 2009, మంగళవారం

గాయాన్ని మాన్పే శక్తి ఏది?

గాలి వానకు గాయ పడ్డ చిలుకమ్మ
గాయం తగిలింది మనసుకా, మనిషికా ?
గాయంలోతు ఎంతైనా మాన్పే హృదయం నీ దగ్గర లేదు
గాడి తప్పిన హృదయం గాలిలో కాగితమే
గోతిలోన పడునో, జ్ఞానాన్నే పంచునో
గాయం మానదు మాన్పే శక్తి నాకు లేదు

నిన్ను నీవు కష్ట పెట్టుకోకు

నిన్ను కూల్చే శక్తులు నీ పక్కనే ఉంటాయి
నిన్ను ముంచే దాక నిదరోకుంటాయి
నిన్ను జాగ్రత్త పరచే మీ మనసును చంపేస్తాయి
నిన్ను నడి సంద్రాన వదిలి నవ్వుకుంటాయి
నిన్ను నీవు కష్ట పెట్టు కోకు
నీ అదృష్టాన్ని వదులుకోకు.

18, జనవరి 2009, ఆదివారం

రాధిక నేను నీ కోసం

రాధేయ విధేయుడుగా నేను నీ కోసం
ధిక్కరించను నీ మాట నీ సంతోషం కోసం
కన్నీరు చిందించనీయను కలలోనైనా
నీలి కురులకు ముడి వేసుకుంటావో
కోరుకుని మరీ నీ గుండెల్లో దాచుకుంటావో
సంతసించి నీకు కనువిందు చేస్తాను
నేను నీలో సగ భాగ మవుతాను
నుదుట తిలకం దిద్ది కడదాకా తోడు ఉంటాను